తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య ఫ్రెండ్లీ పోటీ మాత్రమే వుందని అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేస్తే.. టీఆర్ఎస్ పార్టీని చులకన చేసే విధంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఫ్రభుత్వం ఏర్పడితే తమ చేతుల్లోనే స్టీరింగ్ వుంటుందని, అందుకని ఆ పార్టీనే మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేలా.. ముస్లింలు అందరూ టీఆర్ఎస్ కే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి అవగాహన కుదిరిందో తెలియదు కానీ తమ అభ్యర్థులు లేని చోట, కేవలం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వున్న చోట ప్రత్యర్థి పార్టీలను ఓడించాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం నేతలు టీఆర్ఎస్కు ఓటు వేయాలంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ చేతుల్లోకే ప్రభుత్వ పగ్గాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత రాత్రి ప్రచారం నిర్వహించిన ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ, ప్రజాకూటమికి బుద్ధి చెప్పాలని ఒవైసీ పిలుపునిచ్చారు. అంతేకాదు, ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న టీఆర్ఎస్కు ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రహ్మత్నగర్ డివిజన్ హబీబ్ఫాతిమా నగర్, సంజయ్నగర్ కూడలిలో నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన... ప్రభుత్వం ఏర్పాటు చేసిన 236 మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, ఒక్కోక్కరిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు.
అయితే ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘లేని మామ కన్నా.. గుడ్డి మామ నయం’ అన్నట్లు టీఆర్ఎస్కు మద్దతిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ గెలిస్తే స్టీరింగ్ మన చేతుల్లోనే ఉంటుందని చమత్కరించారు. ఎనిమిది చోట్ల ఎంఐఎం పోటీ చేస్తోందని, మజ్లిస్ బరిలో లేనిచోట టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తీరు ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని ఒవైసీ ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more