టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ముఖ్యమంత్రి, ఆంద్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నుంచి తాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా వుందని నందమూరి సుహాసిని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్నగారి చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ కూతురిగా, యావత్ తెలంగాణ ప్రజలను తనను ఆడపడచులా ఆశీర్వదిస్తారని మరీ ముఖ్యంగా కుకట్ పల్లి ఓటరు మహాశయులు, కూటమి పార్టీల కార్యకర్తలు తనకు అండగా నిలుస్తారని పేర్కోన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నానని.. తాను కూడా ప్రజాసేవ చేయగలనన్న నమ్మకం, విశ్వాసంతో టిక్కెట్ కేటాయించి కూకట్పల్లి టీడీపీ అభ్యర్థి బరిలో నిలిపినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలని నందమూరి సుహాసిని చెప్పారు. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. శనివారం నామినేషన్ దాఖలు చేస్తానని సుహాసిని తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు చిన్నప్పటి నుంచీ ఉందని.. ప్రజలకోసం అనునిత్యం కష్టపడతానని చెప్పారు. ప్రముఖ సినీనటులు, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ ఎన్నికల ప్రచారానికి వస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అన్ని విషయాలపైనా రేపు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మాట్లాడతానని సుహాసిని స్పష్టం చేశారు. ప్రజలంతా తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఎన్టీఆర్ ఆశయాలకోసం సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని నందమూరి రామకృష్ణ అన్నారు. హరికృష్ణ కుమార్తెను అందరూ ఆశీర్వదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Wishing my sister Suhasini garu all the very best, as she takes her first step into public service pic.twitter.com/Hl2TJ4rMsd
— Jr NTR (@tarak9999) November 17, 2018
All the best Suhasini Akka for your new journey! pic.twitter.com/cBK1B4iL7i
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 17, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more