ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగించే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. పల్స్ సర్వే, రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతో ప్రజలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, ప్రభుత్వ పాలన బాగోలేదని బటన్ నొక్కితే వారి ఓట్లు గల్లంతు అవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా నకిలీ ఓటర్లను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో వైసీపీ నేతలతో ఎన్నికల అధికారి సిసోడియాను కలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ 60 లక్షల ఓట్లను ప్రభుత్వం తొలగించిందని అంబటి రాంబాబు అరోపించారు. వీటిలో కడపలో 4.90 లక్షల ఓట్లు, కర్నూలులో 6.31 లక్షల ఓట్లు, చిత్తూరులో 4 లక్షల ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని స్వస్థలం సత్తెనపల్లిలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్లు సైతం గల్లంతు అయ్యాయని విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి సిసోడియా దృష్టికి తీసుకెళ్లామని అంబటి తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 40 లక్షల వరకూ నకిలీ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల గిమ్మిక్కులు చేయడంలో చంద్రబాబు ఉద్ధండుడనీ, ప్రజలు జాగ్రత్తగా ఓటును కాపాడుకోవాలని సూచించారు. ఇక తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్భవించిన తెలుగుదుశం పార్టీ ఇప్పుడు అదే పార్టీతో జతకట్టడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్లు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ తమను విమర్శించిన పార్టీ ఇప్పుడెలా కాంగ్రెస్ తో జతకడుతుందని నిలదీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more