కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరితే మంత్రి పదవితో పాటు రూ.30 కోట్ల నగదు ఇస్తామని తనకు బీజేపి నేతల నుంచి భలే మంచి ఆఫర్ వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్ సంచలన ఆరోపణలు చేశారు. బెళగావి రూరల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ కమళం ప్లాన్ అంటూ కొన్ని విషయాలను వెల్లడించారు. హైదరాబాద్లో ఉన్న సమయంలో ఓ బీజేపీ నేత తనకు ఫోన్ చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరితో ముందుగా రూ.30 కోట్ల నగదు ఇస్తామన్నారని అమె విషయాన్ని వెల్లడించారు.
అంతా సవ్యంగా జరిగి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆఫర్ కు సంబంధించిన సంభాషణల్ని మొబైల్ లో రికార్డ్ చేసి రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ దృష్టికి తీసుకెళ్లానని కూడా లక్ష్మీ చెప్పారు. దక్షిణాదిపై జరుగుతున్న ‘ఆపరేషన్ కమలం’ గురించి రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలతో చర్చించా. అయితే కర్ణాటకలో ప్రస్తుతం కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగుతుందని అమె ధీమా వ్యక్తం చేశారు.
కాగా తమ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదని’ చెప్పిన అమె అరోపణలను బీజేపి తిప్పకొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. జర్కిహోళి సోదరులతో తాజా వివాదాలతో పార్టీలో ఆదరణ కరువైన నేపథ్యంలో మహిళా ఎమ్మెల్యే బీజేపీపై విమర్శలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో చేపట్టనున్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు కోసమే హెబ్బాల్కర్ ఈ ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేతలు ఆమె ఆరోపణల్ని ఖండించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more