సినీ ఫక్కీలో పోలీస్ స్టేషన్ లోని పోలీసులపై దాడి చేసిన ఓ నిందితుడు ఠాణా నుంచి పారిపోయిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పాతికేళ్ల అగంతకుడు అర్థరాత్రి వేళ పోలిస్ స్టేషన్లో వున్న హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో పాటు సెంట్రీ విధుల్లో వున్న కానిస్టేబుల్ పై విచక్షణ రహితంగా దాడి చేసి స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడు. పోలిస్ స్టేషన్ లోని ఉక్కు నాగలి అకారంలో వున్న వస్తువును చేతబట్టుకుని ఇద్దరి పోలీసులను ఒక్కో ఏటు వేసి వారు అపస్మారకస్థితిలోకి జారుకోగానే తప్పించుకుపోయాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని భిండ్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
భిండ్ జిల్లా ఉమ్రీ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఠాణా ఇంచార్జీ సిపీఎస్ చౌదరి తెలిపిన ప్రకారం ఇలా వున్నాయి. ఉమ్రిలోని స్థానిక మార్కెట్ వద్ద నానా హంగామా చేస్తున్నట్లు పిర్యాదులు రావడంతో అక్కడికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ బాబు.. హంగామా చేస్తున్న పాతికేళ్ల అగంతకుడు విష్ణు రాజ్వత్ తో పాటు అతని స్నేహితుడు మన్ సింగ్ రాజ్ పుత్ లను అదుపులోకి తీసుకుని స్టేషన్ వచ్చాడు. స్టేషన్ లో వారిని కూర్చోబెట్టి హెడ్ కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ రాస్తువున్నాడు.
అయితే సెంట్రీగా విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుల్ గజరాజ్ కూడా అర్థరాత్రి కావడంతో ఎవరూ లేరని హెడ్ కానిస్టేబుల్ వద్దకు చేరుకుని ఆయన పక్కనే కూర్చున్నాడు. అదను కోసం వేచి చూసిన విష్ణు.. స్టేషన్ లోని ఓ మూల వున్న ఉక్కు నాగలి ఆకారంలోని ఆయుధాన్ని చేతిలోకి తీసుకుని దాంతో ముందుగా హెడ్ కానిస్టేబుల్ తలపై వెనుకగా వస్తూనే వేటు వేయడంతో ఆయన వెంటనే సృహకొల్పోయాడు. ఏం జరిగిందని చూసే లోపు కానిస్టేబుల్ గజ్ రాజ్ ను కూడా అదే ఆయుధంతో తలపై మోదాడు. ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంలో విష్ణు తప్పించుకుని పారిపోయాడు.
#WATCH Dramatic visuals of an undertrial prisoner viciously attacking two prison guards at a police station in Bhind on 9th September. One police personnel has been referred to Delhi for treatment, another is under treatment at a district hospital in Bhind (Source: CCTV footage) pic.twitter.com/eXEQ5eH51y
— ANI (@ANI) September 11, 2018
పెట్రోలింగ్ విధులు ముగించుకుని వచ్చిన పోలీసులు ఘటనను చూసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అసలేం జరిగిందన్న వివరాలను తెలుసుకునేందుకు సిసిటీవీ ఫూటేజీని పోలీసులు పరిశీలించగా ఈ దారుణ ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు పోలీసులు బాధ్యతారాహిత్యం అంటుండగా, మరికొందరు మన చట్టం కల్పిస్తున్న అవకాశమంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, పరారైన నిందితుడు విష్ణుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడ్ని పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారు. ఇక ఉమేష్ ను చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించగా.. మరో వ్యక్తిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more