మనుషుల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు చేసిన నార్త్ జోన్ పోలీసులు ఇవాళ ఉదయం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఆయనను చంచల్ గూడ జైలుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు పంపింది. ఫేక్ పాస్ పోర్టులతో ముగ్గురు వ్యక్తులను జగ్గారెడ్డి అమెరికా పంపించినట్లుగా పోలీసుల అభియోగాలు మోపారు. కాగా, జగ్గారెడ్డిని అరెస్టు అక్రమమని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. జగ్గారెడ్డిపై తెలంగాణా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకిందే అరెస్టు చేసిందని, దీంతో ఆయనకు తక్షణం బెయిలు మంజూరు చేయాలని కూడా ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అశ్రయించారు.
2004లో జగ్గారెడ్డి తనతో పాటు భార్య, పిల్లల పేరుమీద పాస్ పోర్టులు తీసుకుని వేరొకరిని అమెరికా తీసుకెళ్లినట్లు గుర్తించామని డీసీపీ సుమతి మీడియా సమావేశంలో తెలిపారు. ఆయనతో పాటు వెళ్లింది ఎవరో గుర్తించాల్సి ఉందని.. వారు తెలంగాణకు చెందిన వారు మాత్రం కాదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అంజయ్యకు వచ్చిన సమాచారం మేరకు దీనిపై కేసు నమోదు చేశామన్నారు. పాస్ పోర్టులో జగ్గారెడ్డి భార్య పోటో, పిల్లల పుట్టిన తేదీలు మార్పిడి జరిగిందని తెలిపారు.
అక్రమంగా తరలించిన ముగ్గురి నుంచి జగ్గారెడ్డి లక్షల్లో వసూలు చేసినట్లు గుర్తించామని.. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారని డీసీపీ తెలిపారు. ఆయనపై అధికార దుర్వినయోగం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఉదయం గాంధీ ఆస్పత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో ఆయనను హాజరుపర్చారు.
కాగా, రాజకీయ కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ పేర్కోంది. జగ్గారెడ్డిని నేరుగా ఎదుర్కోనే దమ్ము, ధైర్యం కేసీఆర్ ప్రభుత్వానికి లేక.. అదనుకోసం వేచి చూసిన ప్రభుత్వం కుతంత్రంతో సరిగ్గా ఎన్నికల సమయంలో అక్రమ కేసులు బనాయించి ఆయనను అరెస్టు చేసిందని అరోపించింది. పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిజంగా ప్రభుత్వానికి అంత చిత్తశుద్దే వుంటే.. గతంలో అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పరపతిని వినియోగించి అక్రమ మనుషుల రవాణ చేశారన్న అభియోగాలు గతంలో తెరపైకి వచ్చాయని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీలో వున్న నేతలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ.. కాంగ్రెస్ లో వున్న నేతలపై మాత్రమే అక్రమ కేసులను బనాయిస్తుందని అరోపించారు. అక్రమ రవాణా కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న టీఆర్ఎస్ నేతలందరినీ అదుపులోకి తీసుకుని విచారించే సాహసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయగలదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డిని పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 2004లో తప్పుడు పత్రాలు సమర్పిస్తే అధికారులు ఇప్పటి వరకు ఏం చేశారని నిలదీశారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని ఉత్తమ్ ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more