తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం పరమపదించారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ప్రభుత్వం ప్రజలు ఎలాంటి అందోళనకు, ఉద్వేగానికి గురికాకుండా.. ఎలాంటి విపరీత చర్యలకు పాల్పడకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా మద్యం దుకాణాలను మూసివేయాలని అదేశాలను జారీ చేస్తూ.. ఈ అదేశాలను తక్షణం అమలుపర్చాలని అటు పోలీసు ఇటు ఎక్సైజ్ శాఖలకు అదేశాలిచ్చింది. దీంతో కరుణానిధి మరణంతో తమిళ తంబీలు రైలు, బస్సులలో తరలివచ్చారు.
చెన్నైలోని మెరినా బీచ్ అనుకుంటే పొరబాటే.. తమిళనాడు సరిహద్దులో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోకి వచ్చారు. కరుణానిధి అంత్యక్రియలు బుధవారం జరుగుతున్న క్రమంలో వారు రైళ్లనున, బస్సులను ఆశ్రయించి ఏపీకి వచ్చారు. ఎందుకంటే.. మాజీ సీఎం కరుణానిధి మరణంతో అక్కడి మధ్యం దుకాణాలన్నీ రెండు రోజుల పాటు బంద్ చేశారు. దీంతో పిడుగులాంటి వార్తను జీర్ణం చేసుకోవాలంటే మద్యం పడాల్సిందేనంటూ కొందరు కరుణనిధి అస్తమించిన ధుఖంలో మద్యం సేవించారు.
ఇక మరికోందరు మాత్రం కరుణానిధి అంశాన్ని పక్కనబెట్టి.. మందులేనిదే వుండలేమని.. చుక్క పడకపోతే పూట గడవదన్నట్లుగా నెల్లూరుకు బారులు తీరారు. తమిళ తంబిల రాకతో జిల్లాలోని తడ, సూళ్లూరుపేట మద్యం షాపులకు పండగే అయ్యింది. దీంతో సూళ్లూరుపేట, తడలోని మద్యంషాపులన్నీ కిటకిటలాడిపోయాయి. అంతేకాదు వీరి రాకతో చెన్నై నుంచి సూళ్లూరుపేటకు వచ్చే ప్రతి సబర్బన్ రైలు మందుబాబులతో కిటకిటలాడిపోయింది.
చెంగాళమ్మ తిరునాళ్లకు వచ్చినట్లు తమిళనాడు నుంచి రైళ్లల్లో మందుబాబులు విచ్చేయడం విశేషం. దీంతో మద్యం దుకాణాల వద్ద ఏమి జరుగుతుందోనని ప్రజలు చర్చించుకున్నారు. అయితే మద్యం ప్రియులు దానిని అస్వాదించడం కోసం ఎక్కడికైనా వెళ్తారనేందుకు ఇదే ఉదాహరణ. అలాగే తమిళనాడులో హోటళ్లు సైతం మూసివేయటంతో గుమ్మిడిపూడి నుంచి లారీల్లో జనం తడలోని హోటళ్లకు ఎగబడ్డారు. తొలుత మద్యం షాపులు, హోటళ్ల ముందు సందడిని చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు చివరికి విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more