క్రైస్తవ మతస్థులకు వారు ఏదైనా తప్పు, లేక పాపం, లేక నేరం చేసిన దానిని బాపుకునేందుకు చర్చికి వెళ్లి అక్కడ వుండే పాప పరిహార బోనులోకి వెళ్లి వారు తమ పాపాన్ని వివరించి.. క్షమించమని జీసస్ ను వేడుకుంటారు. దేవుడికి, భక్తుడికి మధ్య వారధిగా వున్న పాస్టర్లు.. అదే బోనులోని అవతలి వైపున వుంటూ పూర్తి పాపాన్ని విన్ని.. వారిన క్షమించి.. ఇకపై ఇలాంటివి పునారవృతం చేయరాదని.. వారి తప్పులను క్షమించమని కోరుతూ ప్రార్థనలు చేస్తారు. తప్పులు చేసిన అందరూ ఇలా తమ పాపపరిహారాన్ని చేసుకుంటారు.
ఇలానే తాను చేసిన ఓ తప్పుకు పాప పరిహారం చేసుకోవడం కోసం చర్చికి వచ్చిన వివాహితను.. పాప పరిహార బోనులో అవతలి వైపు వున్న పాస్టర్లు.. కామపిచాలు మాదిరిగా తయారై.. తమ పాపాన్ని చెప్పుకున్న వివాహితను బ్లాక్ మెయిల్ చేస్తూ.. అమెపై అత్యాచారం చేశారు. ఈ ఘోరం కేరళలో చోటు చేసుకుంది. పెళ్లికి ముందు జరిగిన ఒక పొరపాటును ప్రభువుతో చెప్పుకుని, పాప పరిహారం చేసుకోవాలనుకున్న బాధితురాలు మలంకర ఆర్థొడాక్స్ చర్చ్ కు వచ్చింది. తిరువళ్లకు చెందిన ఈ మహిళ పెళ్లికి ముందు ఓ ఫాదర్ తో సన్నిహితంగా మెలిగింది. పెళ్లైన తర్వాత ఈ తప్పును పదేపదే తలుచుకుంటూ కుమిలిపోయింది.
ఈ నేపథ్యంలో, చర్చికి వచ్చి మరో ఫాదర్ తో చేసిన తప్పును చెప్పుకుంది. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకున్న ఆ ఫాదర్... ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.... ఆమె తనతో ఉన్న అశ్లీల చిత్రాలను, వీడియోలను మరో ఫాదర్ కు పంపాడు. ఇలా ఫొటోలు, వీడియోలు మరికొందరు ఫాదర్లకు చేరాయి. వీరంతా వాటిని ఆమెకు చూపిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు ఫాదర్లు ఆమెపై లైంగిక దాడి చేశారు.
గత ఫిబ్రవరి తన భార్య మెయిల్ కు ఓ హోటల్ కు సంబంధించి, భారీ బిల్లు వచ్చింది. దీన్ని చూసిన భర్త షాక్ కు గురయ్యాడు. భార్యను నిలదీసి అడగడంతో... జరిగిన ఘోరాన్ని ఆమె వివరించింది. వెంటనే ఆయన ఫాదర్లపై చర్చి నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన కమిటీ... ఐదుగురు ఫాదర్లను సస్పెండ్ చేసింది. అయితే, మొత్తం ఎనిమిది మంది ఫాదర్లు తన భార్యపై అత్యాచారం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more