టీవీ సీరియల్స్ను తలదన్నే రీతిలో ఓ మహిళ తన అత్తింటివారికి హతమార్చింది. తనను అందవీహీనంగా వున్నారని అవమానించినందుకు అమె ఇంతవరకు తెగించింది. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో జూన్ 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ప్రగ్యా సర్వేష్ అలియాస్ జ్యోతి, సురేష్ సర్వసేకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఆమె అత్తింటి వారు, బంధువులు ఆమెను నల్లగా ఉన్నావని, అందంగా లేవని వేధిస్తుండేవారు. అంతేకాదు వంట కూడా చేతకాదు.. రుచిగా వండటం తెలియదని అవమానించేవారు.
వీటన్నింటిని మనసులో పెట్టుకున్న ప్రగ్యా తన అత్తవారింటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో పహాడ్ గ్రామంలో తన బంధువు అయిన సుభాష్ ఇంట్లో జూన్ 18న శుభకార్యం ఉందని ఆహ్వానం అందింది. ఇదే అదునుగా భావించింది. అత్తింటి వారితో కలిసి జ్యోతి కూడా అక్కడికి వెళ్లింది. అక్కడ విందు భోజనంలో విషం కలిపి అత్తింటివారిని మొత్తాన్ని చంపాలని నిర్ణయించి.. భోజనంలో విషం కలిపింది. ఈ భోజనం అందరికీ వెళ్లింది. దాన్ని అడ్డుకుంటే తన కుట్ర ఎక్కడ బయట పడుతుందో అని సైలెంట్గా ఉంది. విషం కలిపిన ఆహారాన్ని 100 మంది వరకు తిన్నారు.
ఆ వెంటనే విషపూరిత అహారం తిన్నవారందరికీ వాంతులు అయ్యాయి. అందర్నీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 5 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉన్న నలుగురు చిన్నారులు చనిపోయారు. 50 ఏళ్ల మరో వృద్ధుడు కూడా చనిపోయారు. మరికొంత మంది ఆరోగ్యం విషమంగా ఉంది. శుభకార్యంలో ఇంత మంది అస్వస్థకు గురవ్వటంతో.. పోలీసులు విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆహార పదార్ధాలను ల్యాబ్ కు పంపించారు. అందులో విషం ఉందని నివేదక తేల్చింది. అయితే ఎవరి విషం కలిపారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో జ్యోతి విషం కలిపినట్లు తేలింది. దీంతో అమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు విషం కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని విచారించగా.. అసలు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం తనకు పెళ్లయిందని, పెళ్లయిన నాటి నుంచి తన శరీర రంగుపై నానా రకాల కామెంట్లు చేసేవారని, వంటకూ వంకలు పెట్టేవారని, అందుకే కుటుంబంలోని అందరినీ చంపేందుకు నిశ్చయించుకుని భోజనంలో విషం కలిపానని ఆమె అంగీకరించింది. అత్తింటిపై పగ.. ఐదుగురు ప్రాణాలు తీసింది. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారుల జీవితాలను సమాధి చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more