రాజకీయాలపై సగటు మధ్యతరగతి విద్యావంతులైన యువతీ యువకులతో పాటు అందరూ అనాసక్తిని కనబరుస్తూ.. దూరంగా వెళ్లిపోతున్నారని.. ఇకపై అలా వ్యవహరించవద్దని మధ్యతరగతి ప్రజలను జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ కోరారు. రాజకీయాలంటేనే నిరాశ, నిసృహ, అసంతృప్తిని సగటు మధ్యతరగతి పౌరుడు వ్యక్తం చేస్తున్నాడని అభిప్రాయపడిన పవన్.. తాను కూడా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని తెలిపాడు. మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోయే కంటే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడాలనే తాను నిర్ణయించుకున్నానని జనసేనాని తెలిపాడు. మన జీవితాన్ని అనునిత్యం ప్రభావితం చేసే రాజకీయాలకు దూరంగా జరగొద్దని పవన్ పిలుపునిచ్చారు.
Looking forward for the “Rise of Middleclass.” pic.twitter.com/6PZlPHi8iy
— Pawan Kalyan (@PawanKalyan) June 23, 2018
‘పోరాడకపోతే.. మనల్ని వెన్నెముక లేని వారిలా మార్చేస్తారు. పోరాట స్ఫూర్తిని వీడొద్దు. రాజకీయాల్లో దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు రాజకీయాల్లో చురుగ్గా మారాలని కోరుకుంటున్నా. రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మధ్యతరగతి వర్గం పోరాడింది. మధ్యతరగతి ఎదగాలని ఆశిస్తున్నా. మన మాతృభూమికి వారి భాగస్వామ్యం అవసరం’ అని పవన్ ట్వీట్ చేశారు.
జనసైనికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయిలో రాజకీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పవన్ తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి దీనికి శ్రీకారం చుడతామన్నారు. జూన్ చివరి నుంచి జనసేన వ్యూహకర్త దేవ్ ఆధ్వర్యంలో విశాఖలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని జనసేనాని చెప్పారు. పోరాటం చేసేవారికి తెగువతోపాటు సమర్థత, విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ నాతో ఎప్పటికీ ఉండేది మీరేనని జనసైనికులను ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారు.
JSP training program will start from this month end & it will start from UttaraAndhra..(part2) pic.twitter.com/JkmYNLeEc8
— Pawan Kalyan (@PawanKalyan) June 23, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more