జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ సర్కార్ ప్రజలకు రక్షణదారుగా కాకుండా భూఆక్రమణదారుగా వ్యవహరిస్తుందని వరుస విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా టీటీడీలోని శ్రీవారి అభరణాలు, రూబీ డైమండ్ ఏమయ్యాయన్న విషయమై కూడా ఆయన ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వంపై, టీటీడీపై పెద్దఎత్తున్న దుశ్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు కలుగుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా వారిపై వుందదని చురకలంటించారు.
ఇవాళ మధ్యాహ్నం రాజధాని భూములపై స్పందించిన పవన్.. భూముల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే కబ్జాలకు అండగా ఉంటోందని ఆరోపించారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే సరిపడా భూముల్ని సమీకరించినందున భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని సూచించిన ఆయన, అలా చేస్తే తాను పోరాటం చేస్తానని పవన్ హెచ్చరించారు. ఈ అంశంపై అమరావతి ప్రాంత రైతులతో తాను సమావేశం కానున్నట్లు తెలిపారు. సోంపేట థర్మల్ విద్యుత్, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ వైఖరిని సైతం పవన్ తప్పుబడుతూ ట్వీట్ చేశారు.
‘ఏపీ సీనియర్ రాజకీయ నాయకులు తమ దోపిడీలను ఆపాలి.. వెనుకబడిన ఉత్తరాంధ్రను ఇంకా శాశ్వతంగా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తూ కాలుష్యకారక పరిశ్రమలను ఏర్పాటుచేసి దాన్ని ఓ డంపింగ్ యార్డుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని’ దుమ్మెత్తిపోశారు. అలాగే శ్రీవారి ఆభరణాలపై రమణదీక్షితుల ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదని అన్నారు. ‘గులాబీ రంగు వజ్రంతోపాటు విలువైన ఆభరణాలు మాయమైనట్టు టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లేవనెత్తిన అంశంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు’ అంటూ విమర్శించారు.
v
#TTDPINKDIAMOND pic.twitter.com/SRsmpFrSb8
— Pawan Kalyan (@PawanKalyan) June 21, 2018
‘భక్తులు విసిరిన నాణేలుకు గులాబీ రంగు వజ్రం ముక్కలైందని అంటున్నారు.. అందులో ఉన్న నిజమెంతో భక్తులుగా తెలుసుకోవాలనుకుంటున్నాం.. అలాంటప్పుడు ఆ శకలాలను ఎందుకు ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించడం లేదు.. మరి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే సామెత కూడా ఉంది కదా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జూన్ 23న పవన్ కళ్యాణ్ విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా ఈ నెల 26 నుంచి విశాఖలో పోరాట యాత్ర పునః ప్రారంభం కానుంది. twitter-tweet"
#TTDPINKDIAMOND #RamanadeekshithuluTTD pic.twitter.com/PRk1dkktHD
— Pawan Kalyan (@PawanKalyan) June 21, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more