ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన బాటలోనే ప్రయాణిస్తున్నారు అంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ప్రజా సంకల్పయాత్రతో సాగుతున్న ఈ యాత్ర గత 182 రోజులుగా కొనసాగి ఇవాళ 183వ రోజుకు చేరుకుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ సంకల్పయాత్ర ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడదవోలుకు నియోజకవర్గంలో విజయవంతంగా కోనసాగుతుంది.
నిడదవోలు నియోజకవర్గంలోని ఇవాళ ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కానూరు క్రాస్ రోడ్డుకు రాజన్న బిడ్డ పాదయాత్ర చేరుకుంటుంది. అయితే సరిగ్గా జగన్ పాదయాత్ర పెరవలి మండలం కానూరు కొండాలమ్మ గుడి వద్ద నుంచి తన యాత్ర ప్రారంభించగా.. అక్కడ జోరుగా గాలి వీచింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వున్న చెట్లకు తెట్ట కట్టిన తేనెటీగలు ప్రజాసంకల్ప యాత్రంలో కలకలం రేపాయి. కార్యకర్తలు, ప్రజలు అందోళనకు గురయ్యారు.
దీంతో జగన్ ను పోలీసుల, రక్షణ వలయం అధికారులతో పాటు స్థానిక నేతలు కూడా ఆయన చుట్టూ కవచంలా రక్షణగా నిలిచారు. అయితే అక్కడే వుంటే తమ పార్టీనేతలతో పాటు పోలీసులకు కూడా సవాల్ గా మారుతుందని భావించిన జగన్.. తన ప్రజాసంకల్ప యాత్రను కొనసాగించారు. తేనెటీగలు దూసుకువస్తున్నా.. వాటిని చేధించుకుని ముందుకు కదిలారు. జగన్ లోని మొక్కవోని ధైర్యానికి తేనెటీగలు కూడా తలొగ్గాయి. దీంతో జగన్ పాదయాత్ర ముందుకు సాగింది.
అయితే ఈ సందర్భంగా జగన్ పార్టీ గుర్తు (ఫ్యాను)ను పోలీసులు, కార్యకర్తలు, నాయకులు గుర్తుచేసుకున్నారు. తమ జేబుల్లోంచి కర్చీఫులు తీసి వాటిని ఫ్యాను మాదిరిగా చుట్టూ తిప్పుతూ.. ఆయన గుర్తును ప్రచారం చేశారు. తేనెటీగల దాడిలో పార్టీకి చెందిన 10 మందికి నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో జోరువానను సైతం లెక్కచేయకుండా జగన్ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more