2019లో జరగనున్న తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని ప్రకటించిన జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆ మేరకు వేగంగా తన ఏర్పాట్లలో నిమగ్నమవుతూనే పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసుకునే ప్రక్రియకు కూడా స్వయంగా నడుం చుట్టారు. ఇందులో భాగంగా అమరావతి ఏర్పాటులో భూములను కోల్పోయిన రైతులు మొదలుకుని ఇప్పటి వరకు అనేక సమస్యలపై స్పందించారు. శ్రీకాకుళంలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు. పాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్య సహా అనేక సమస్యలపై తన గళం విప్పారు. అటు నేతలన్నల సమస్యల నుంచి ఇటు రైతన్నల సమస్యలపై పోరాట పంథాను సాగించారు.
ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా శెట్టిపల్లికి చెందిన రైతన్నలు తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పవన్ ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని విస్మరించిందని అవేదన వ్యక్తం చేశారు. దీంతో చిత్తూరు జిల్లాలోని ఈ గ్రామాన్ని ఇవాళ జనసేనాని సందర్శించారు. ప్రభుత్వానికి మానవతా దృష్టి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని అన్నారు. పైడిపల్లిలో ఇదే తరహా భూములకు పట్టాలిచ్చి శెట్టిపల్లికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. శెట్టిపల్లిలో భూసమీకరణ చేస్తే ప్రజలే ఎదురు తిరగాలని పవన్ వ్యాఖ్యానించారు.
రైతుల మధ్య ప్రభుత్వమే విభజన తీసుకువస్తుందని అక్షేపించారు. భూసేకరణ విధానంలో మార్పు తీసుకురావాలని, శెట్టిపల్లి భూములను సమీకరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. ప్రభుత్వం శెట్టిపల్లి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఒక గ్రామానికి ఒక విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం మరో గ్రామానికి మరో విధానాన్ని వర్తింపజేస్తూ.. వారి బలహీనతలే తమ బలంగా మార్చుకుంటుందని ఎద్దేవా చేశారు.
ఎన్నికలకు ముందు శెట్టిపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతుందని ఆయన దుయ్యబట్టారు. టీడీపీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలనే అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరిస్తుందని ఇది సముచితం కాదని అన్నారు. తమకు ఓట్లేవేసి ప్రజలే తమకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ పథకంపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఏపీలో రైతు రుణ మాఫీ వ్యవహారం ఎలా ఉందంటే.. బిందెడు నీళ్లు ఆశ చూపి మూడు స్పూన్ల నీళ్లు తాగించినట్టుగా ఉందని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more