Scorching Heat IMD forecasts a scorching week మాడు పగలగొడుతున్న భానుడు.. మరో వారం ఇంతే..!

Imd forecasts a scorching week ahead in telangana

Indian Meteorological Department, summer sun, scorching week, scorching heat, heat wave, thunderstorms, gusty winds, hyderabad, telangana

The summer sun showed no signs of relenting and beat down with vengeance on the city, with the maximum temperature staying put at 42 degree Celsius n hyderabad. The situation across the State was no different, with Adilabad and Nizamabad registering 44.3 and 44 degree Celsius

మాడు పగలగొడుతున్న భానుడు.. మరో వారం ఇంతే..!

Posted: 05/01/2018 10:03 AM IST
Imd forecasts a scorching week ahead in telangana

ప్రచండ భానుడి భగభగలకు తెలుగురాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలో తప్పనిసరై వెళ్తున్న ప్రజల మాడును భానుడి పగలగొట్టేలా తీవ్ర ఎండను కాస్తున్నాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుత్లో పనులపై బయటకు వెళ్లిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి మే వరకు ఎండ తీవ్రత అధికంగా వుంటుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు అల్లాడుతున్నారు. గడిచిన నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో ఘణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఉదయం 8 గం. నుంచి భానుని ప్రతాపం ప్రజల పై పడుతోంది. పది గంటలు దాటిదంటే చాలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేకుండా తయారైంది. ఇప్పుడే ఇలావుందంటీ అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. మే నెల ప్రారంభం కావడంతో ఈ నెలలో ఎండల తీవ్రత మరెంతలా వుంటుందన్న అందోళన ప్రజల్లో రేకెత్తుతుంది. ఇప్పటికే జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.

ఇక హైదరాబాద్ నగరంలో గత రెండు మూడు రోజుల నుంచి భానుడి ప్రతాపం అధికంగా వుంది. సాధారణ వేసవి పరిస్థితులకంటే మూడు డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదు కావడంతో.. ఎండలో వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గత పదేళ్ల ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలు సోమవారం ఆదిలాబాద్‌లో నమోదైంది. ఈ రికార్డు గతేడాది ఏప్రిల్‌ 19న తొలిసారి నమోదవగా తిరిగి ఈ ఏడాది సోమవారం దానికి సమానస్థాయిలో ఎండ మండిపోయింది.

భానుడి విశ్వరూపంతో ప్రజలు అల్లాడుతున్న క్రమంలో మరోవైపు తీవ్ర ఉక్కపోత కూడా సమస్యను జఠిలంగా మారుస్తుంది. గాలిలో తేమ పూర్తిగా ఆవిరై పోతుండటంతో గాలి వీచినా.. వేడమే పుట్టుకువస్తుందని ప్రజలు అంటున్నారు. నిప్పుల కుంపటి ప్రక్కనే ఉన్నంత విధంగా వేడి గాలి హడలెత్తిస్తోంది. కాగా, ఎండ వేడి ఇలాగే కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అధిక ఎండల కారణంగా వడగాలులు వీస్తున్నాయని, ప్రజలుఅప్రమత్తంగా ఉండాలనిసూచించింది.

రాజస్థాన్ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారతాల నడుమ గాలుల అస్థిరత కారణంగా ఉష్ణోగ్రతల పెరుగుతుండటంతో పాటు వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు లేదా ఒక మాదిరి వర్షం పడే అవకాశముందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles