మీడియాపై దాడిని అప్రజాస్వామిక చర్యగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ మహాన్యూస్ సిబ్బంది, వాహనాలపై విజయనగరంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూ పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ విడుదల చేశారు.
'మహాన్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తోన్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ ఖండిస్తోంది. మహా న్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం. విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని, మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కాపాడాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది' అని పవన్ పేర్కొన్నారు.
పవన్ ను కలిసిన రామకృష్ణ
మరోవైపు సీపీఐ కార్యదర్శి కే రామకృష్ణ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. జనసేన కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయి తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించుకున్నారు.
జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) సమావేశం నిర్వహించిన అనంతరం జరిగిన వివిధ పరిణామాలపై పవన్తో రామకృష్ణ మాట్లాడారు. వచ్చేనెల 1న తాము గుంటూరులో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్ను రామకృష్ణ కోరారు.
మహా న్యూస్ పై దాడి అప్రజాస్వామికం - @JanaSenaParty Chief @PawanKalyan pic.twitter.com/cZHcoMqf9n
— JanaSena Shatagni (@JSPShatagniTeam) February 22, 2018
AP CPI Secretary K.Ramakrishna Met @JanaSenaParty Chief @PawanKalyan at Party office
— JanaSena Party (@JanaSenaParty) February 22, 2018
Video : https://t.co/8lcw98VnQy pic.twitter.com/r3C6Em0vHk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more