విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దేవాలయంలో అపచారం జరిగిందా..? అత్యంత పవిత్రమైన స్థలపురాణం కలిగిన పుణ్యక్షేత్రంలో వేద మంత్రోచ్చరణలకు బదులు తాంత్రిక పూజలు నిర్వహించారా..? భక్తజనలోకం కొంగుబంగారంగా వెలుగొందుతున్న అమ్మవారి అలయంలో ముక్కుపుడక దొంగలించిన విషయాన్నే ఇప్పటికీ అక్కడికి వెళ్లి దర్శనం చేసుకునే భక్తులు ప్రస్తావిస్తూవుంటారు. అంతేకాక అలయంలోని అనేక అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని కూడా వార్తల్లో రావడంతో అందరికీ తెలిసిపోయింది.
దీనికి తోడు అలయంలో అర్చుకులకు, అలయ సిబ్బందికి, మధ్య జరుగుతున్న తంతూ కూడా భక్తకోటికి తెలుసు. ఇక అమ్మవారి కరుణకటాక్షాలు వుంటే.. తాము కోరుకున్న కోరికలు నెరవవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అలింటి పరమపవిత్రమైన అలయంలో అపచారం జరిగిందని, ఏకంగా అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు రావడంతో అలజడి రేగింది. ఈ మేరకు స్థానికంగా ప్రచారం జోరందుకుంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి సూర్యకుమారి ఆధ్వర్యంలో గత నెల 26న అర్ధరాత్రి ఈ తంతు జరిగినట్టు అరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో దేవస్థానం పాలక మండలి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. డిసెంబర్ 26న అమ్మవారి గర్భాలయం వద్ద అర్చకులు బదులు అపరిత వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రధాన అర్చకుడిని ఆదేశించారు. ఇక దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని కూడా చెప్పారు. అయితే ఆలయంలో ఎటువంటి తాంత్రిక పూజలు జరగలేదని ఈవో సూర్యకుమారి తెలిపారు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు కూడా ఆలయంలో తాంత్రిక పూజ జరిగిందన్న వార్తలపై దర్యాప్తు చేపట్టారు. అయితే గుర్భగుడిలో తాంత్రిక పూజలు జరిగాయన్న ప్రచారంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more