ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కొందరు.. ప్రభుత్వాలే చేయాలి, పాలకులే పట్టించుకోవాలని మరికోందరు ఎదరుచూస్తునే వుంటారు. అలాంటి వారికి మన వంతుగా ఏం చేస్తున్నామని ప్రతీ ఒక్కరు అలోచించి ఎంతో కొంత సాయం అందిస్తే జీవితాలు బాగుపడతాయని ఎందరో పెద్దలు చెప్పిన ఉవాచ. ముఖ్యంగా సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహాలు లేకున్నా.. పాలకుల పర్యవేక్షణ కరువైనా కొందరు మాత్రం తమ బాధ్యతగా ముందుకు వచ్చి వాటిని నివారణకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల కేరళలోని ఓ కౌన్సిలర్ తన వార్డు పరిధిలో ఎవరింటైనా అమ్మాయి పుడితే బంగారాన్ని బహుమతిగా ఇస్తానని చేసిన ఎన్నికల హామీని క్రమం తప్పకుండా పూర్తి చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇక తాజాగా అలాంటి అలోచనే చేశారు బెంగళూరు మేయర్ సంపత్ రాజ్. ఈ నూతన సంవత్సరం రోజున ఏ జంటైనా అమ్మాయిలకు జన్మనిస్తే ఆయా జంటలకు న్యూఇయర్ కానుకను ప్రకటించారు. అయితే ఇది తన పాలకమండలి నుంచి ఇస్తున్న బహుమతిగా పేర్కోన్నారు.
జనవరి 1న జన్మించే ఆడశిశువుకు బెంగళూరు మహానగర పాలికే నుంచి 5 లక్షల రూపాయలను బహుమతిని ఇస్తామని ఆయన ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా నగరవాసులకు ఉత్సాహాన్ని ఇచ్చే ప్రకటన చేశారు ఆయన. 2018 జనవరి ఒకటో తేదీన జన్మించే శిశువులకు ఈ అవకాశమని మేయర్ సంపత్ రాజ్ ప్రకటించారు. ఈ ఆఫర్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు ఈ అవకాశం లేదు. ఆడశిశువులే అయినా.. ప్రైవేట్ ఆసుపత్రిలో గాక.. నగర పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టిన వారికే ఈ ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది.
ఇక మామూలు కాన్పు అనే షరతును కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. సిజేరియన్ ద్వారా కాకుండా.. సహజంగా న్యూ ఇయర్ మొదటి రోజున పుట్టిన ఆడ శిశువులకు బీబీఎంపీ తరఫు నుంచి ఐదు లక్షల రూపాయల బహుమతి దక్కుతుందని తెలిపారు మేయర్. ఆడపిల్లలు పుట్టడంపై కొంతమంది తల్లిదండ్రుల్లో ఉండే వ్యతిరేకతను తగ్గించడానికే ఈ బహుమతిని అనౌన్స్ చేసినట్టుగా మేయర్ వివరించారు. ఎక్కువమంది ఆడపిల్లలు పుట్టినా.. వాళ్లందరికీ బీబీఎంపీ ఈ బహుమతి ఇస్తుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more