అవినీతి రహితంగా భారత నిర్మాణమే తన లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీపై అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు, సామాజిక కార్యకర్త అన్నాహజారే మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన నిజంగా తాను ప్రకటించుకుటున్నట్లుగా అవినీతి వ్యతిరేక భారతదేశ నిర్మాణ స్వాప్నికుడే అయితే అదే లక్ష్యంతో తీసుకువచ్చిన అవినీతి నిరోధక లోక్పాల్ చట్టాన్ని ఎందుకు బలహీనపర్చారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో మూడురోజుల పాటు నిర్వహించిన 'జల్ సమ్మేళన్’లో పాల్గోన్న అన్నా హాజరే మాజీ ప్రధాని మన్మోహన్ కూడా ఈ బిల్లుకు తూట్లు పోడిచారన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెడుతున్న క్రమంలోనే బలహీనం చేస్తే.. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ దానిని మరింత బలోహీన పరిచారని ఆరోపించారు. 'మోదీ ప్రభుత్వం 2016 జూలై 27న పార్లమెంటులో లోక్ పాల్ చట్టానికి సవరణ చేయడం ద్వారా చట్టాన్ని మరింత బలహీనమైందని అవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రభుత్వాధికారుల భార్యలు, పిల్లలు, సంబంధీకులు ప్రతి ఏటా తమ ఆస్తుల వివరాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా పోయిందని ఈ మేరకు మోడీ సర్కారు సవరణ చేసిందని హాజారే అన్నారు.
ఒరిజనల్ చట్టం ప్రకారం,. ప్రభుత్వాధికారుల కుటుంబసభ్యులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి అని హజారే చెప్పారు. సవరణ బిల్లును ఎలాంటి చర్చా లేకుండా కేవలం ఒక్క రోజులోనే ఆమోదించారని, రాజ్యసభలో జూలై 28, 29లో దానిని ప్రవేశపెట్టారని తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే చట్టాన్ని బలహీనపరచారని హజారే మండిపడ్డారు. ఇదేనా అవినీతి రహిత భారత నిర్మాణమని ప్రశ్నించారు. దేశంలో అవినీతికి పాల్పడే వారిలో అధికశాతం ప్రభుత్వ అధికారులేనని అయన అరోపించారు. ఈ మేరకు ఏసీబి, ఐటీ దాడుల్లోబయటపడుతున్న వారి జాబితాలో అధికశాతం వారే వుంటున్నారని అన్నారు.
ఇదిలావుంటే.. సుమారు 70 శాతం వ్యవసాయ అధారితమైన భారత దేశంలో రైతులు తీసుకునే పంట రుణాలకు 1950 చట్టం ప్రకారం చక్రవడ్డీ విధించరాదన్న నిబంధన వుందని అయన తెలిపారు. అయితే బ్యాంకులు ఈ నిబంధనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా చక్రవడ్డీలు వేస్తున్నారని అన్నారు. అయినా ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం మిన్నకుంటోందని ఆయన అన్నారు. ఈ విషయంతో పాటు పలు సమస్యలపై తాను గత మూడున్నరేళ్ల నుంచి 32 ఉత్తరాలు రాశానని, అయితే ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు బదులు రాలేదని అన్నారు. 60 ఏళ్లు పైబడిన రైతులకు రూ.5.000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని హజారే డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more