కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో వున్న కమల పార్టీ నేతలు అదే అధికార మత్తులో తామేం చేస్తున్నామో కూడా మర్చిపోతున్నారు. ఎన్నికల వేళ.. ఓట్ల కోసం కష్టాలు పడే నేతలు ప్రజల గడ్డాలను మీసాలను పట్టుకుని బతిమాలడం చూశాం.. వారు చేస్తున్న పనులను చేస్తూ అకట్టుకునే నేతలను చూశాం.. కానీ ఇక్కడ ఓ బీజేపి పార్టీ నేత మాత్రం ఏకంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చి జాగ్రత్తా అంటూ హెచ్చరిస్తున్నాడు.
తన భార్యకు ఓటు వేయకపోతే మాత్రం బాగోదని, అలా చేసి కష్టాలను తెచ్చుకోకండీ అంటూ హెచ్చరిస్తున్నాడు. ఆయన ఈ ప్రసంగం చేస్తున్న క్రమంలో ఆ రాష్ట్ర మంత్రులిద్దరు కూడా అదే వేదికపై అసీనులైన వున్నారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. కనీసం ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడంపై కనీసం ఎన్నికల సంఘం అధికారులు స్పందిస్తారా.. అని వేచిచూస్తే అది కూడా కష్టమేనని తేలిపోయింది. ఎన్నికల సంఘం అధికారులు ఇంకా నిద్రలోనే జోగుతున్నారు.
ఈ ఘటన ఉత్తర్ ఫ్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా చోటుచేసుకుంది. ఓ వార్డులో తన భార్యను ఎన్నికల బరిలో నిలిపిన బీజేపి నేత తన భార్య శశి శ్రీవాత్సవ తరఫున ప్రచారం చేస్తూ బీజేపీ కౌన్సిలర్ రంజిత్ కుమార్ శ్రీవాత్సవ ఆమెకు ఓటు వేయకపోతే ముస్లింలు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. యోగీ అదిత్యనాథ్ క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రులు దారా సింగ్ చౌహాన్, రమాపతి శాస్త్రిలు అదే వేదికపై అసీనులై వుండగా... వారి ముందే రంజిత్ కుమార్ ఈ హెచ్చరికలు జారీ చేశాడు.
'ఇది సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం కాదు. మీ నాయకులెవరూ మీకు సహాయం చేయలేరు. రోడ్లు, నాలాల మరమ్మత్తుతో పాటు ఇంకా చాలా పనులు స్థానిక సంస్థల చేతిలోనే ఉంటాయి. ఇక్కడ బీజేపీకి ఎదురేలేదు. అందుకే వారి విజయంలో మరింత సహాయం చేయండి. మీరు రంజిత్ కుమార్ భార్యకు ఓటు వేయకపోతే, ఎదుర్కోబోయే కష్టాల నుంచి సమాజ్వాదీ పార్టీ కూడా మిమ్మల్ని కాపాడలేదు. అందుకే ముస్లింలు అందరికీ ఇదే నేను చెబుతున్నా... మాకు ఓటు వేయండి. నేను ఓట్లు అడగడం లేదు..ఒకవేళ ఓటు వేస్తే ప్రశాంతంగా ఉంటారు, లేదంటే కష్టాల పాలవుతారు' అని రంజిత్ కుమార్ హెచ్చరించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more