బేటీ బచావో .. బేటీ పడావో అంటూ కేంద్రం తీసుకొచ్చిన పథకం ఎంత వరకు ప్రతిఫలిమిస్తుందో తెలియదు.. కనీసం శిశు కళ్యాణ్ పేరిట జీఎస్టీ అమలుకు ముందు వరకు దేశ ప్రజల కొన్న ప్రతీ వస్తువుపై అరశాతం మేర వసూలు చేసిన డబ్బు సక్రమంగా ఖర్చైందా..? లేదా.? అన్న విషయాలను పక్కనబెడితే.. ప్రభుత్వాలు కూడా యోచించని రీతిలో ఓ ప్రజా ప్రతినిధి అలోచన చేశాడు. మరీ ముఖ్యంగా అడపిల్ల పుడితే శాపమని భావించే నేటి సమాజంలో మార్పుకు ముందుడగు వేశాడు.
అడపిల్ల.. బంగారు తల్లులను కన్న ప్రతి తల్లికి కనకాన్ని అందించి.. అడ బిడ్డలు కనకమహాలక్ష్ములని తన చేతలతో చాటిచెప్పాడు. ఈయన అలోచన మాత్రం గత రెండేళ్లుగా పెద్ద ఫలితాలనే అందిస్తోంది. బాలికా సంరక్షణకు ఆయన చేస్తున్న కృషి అందరి చేత ప్రశంసలు అందిస్తోంది. కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కళ్ మున్సిపాల్టీలోని వెస్ట్ విల్లూర్ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రహీమ్. ఆయనకొచ్చిన ఆలోచన అక్కడి తల్లిదండ్రుల్లో మార్పు తీసుకువస్తోందంటున్నారు స్థానికులు.
గత మున్సిపల్ ఎన్నికలలో తాను గెలిస్తే ఆడపిల్ల పుడితే బంగారం బహుమతిగా ఇస్తామని హామి ఇచ్చిన అబ్దుల్ రహీమ్.. అన్న మాట ప్రకారం తను వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైనప్పటి నుంచి తన వార్డు పరిధిలో ఆడపిల్లలు జన్మనిచ్చిన తల్లులకు ఒక గ్రాము బంగారు నాణేన్ని అందజేస్తున్నారు. ఇప్పటి వరకూ 16 మంది తల్లలకు బంగారు నాణాలు బహూకరించారు. దీనికోసం ఆయన తనకు కౌన్సిలర్ గా వచ్చే నెల జీతాన్ని వెచ్చిస్తున్నారు.
వృత్తిపరంగా వ్యాపారి అయిన రహీమ్.. ఒకరి నుంచి రూపాయి ఆశించకుండా తనకు ప్రజాసేవ ద్వారా వచ్చే మొత్తాన్ని అదే ప్రజలకు అందిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిందే సేవ చేయడానికి.. వ్యాపారాల కోసం కాదంటున్నారు రహీమ్. ఇక మీదట దాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. కొందరు బంగారు వ్యాపారులు కూడా సహాయం చేయాలని ముందుకు వస్తున్నారు. అయితే రహీమ్ మాత్రం వారి సాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more