తెలంగాణ ప్రజల అకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీయేనని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తన అనుచర కార్యవర్గంతో కలసి హస్తినకు బయలేదేరి వెళ్లనున్న నేపథ్యంలో నిర్వహించిన అత్మీయ సమ్మెళనం కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పురుషోత్తమ్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగిస్తూ..నవ్యాంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని నష్టపర్చుకుని మరీ అమె తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ప్రకటించారని అన్నారు.
నిజంగా సోనియాగాంధీ ఇక్కడ ప్రజల కష్టాలను, నష్టాలను, ఓదార్పును, సహనాన్ని తెలుసుకున్నారని.. తెలంగాణ యువత రాష్ట్రం రాలేదన్న వ్యధతో అత్మబలిదానాలు చేసుకున్న విషయాలతో చలించిపోయి.. రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. రాష్ట్రం సాకారమైన తరువాత తెలంగాణ కేవలం తానే తీసుకువచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్.. సోనియాగాంధీ వద్దకు ఎందుకు వెళ్లి కలిశారని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రవాంఛ ఎందుకు ఉద్భవించిందో మర్చిన కేసీఆర్.. ప్రజలకు మాటలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు బగ్రెలు, గొర్రెలు ఇచ్చి శాంతపరుస్తున్న కేసీఆర్.. అందుకోసమే తెలంగాణ వచ్చిందా..? అందుకోసమే సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చిందా అన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఎప్పుడైనా అమరవీరుల కుటుంబాలతో కలసి పది నిమిషాలు మాట్లాడావా అని నిలదీశారు. గత 14 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేదన్నారు. ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా కేసీఆర్ నేరవేర్చలేదని రేవంత్ దుయ్యబట్టారు. నిరుద్యోగుల అర్తిని తీర్చడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, అయితే తన కుటుంబ సౌఖ్యాని, సంతోషానికి మాత్రం ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తపడుతున్నారని రేవంత్ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more