మత్తు వదలరా.. అంటూ పెద్దలు తరతరాలుగా చెబుతున్నా.. మద్యం మత్తులో జోగుతున్న వారి సంఖ్య కూడా అదంతే గణనీయంగా పెరుగుతుంది తప్ప.. ఏ మాత్రం తక్కువ కావడం లేదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియుల సంఖ్య మరీ ఎక్కువగా వుంది. ఈ నేపథ్యంలో తాగిన తరువాత ప్రమాదాలకు గురికాకుండా వాహనాలను నడపరాదంటూ పోలీసులు అదేశాలు జారీ చేసినా.. వాటిని కొన్నాళ్లు పాటించి.. ఇక పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం లేదని తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుంది.
మద్యం మత్తులో వాహనాలను నడిపి ఏదైనా జరగరానిది జరిగిన తరువాత అందరూ పోలీసులనే అడిపోసుకుంటారు. వారేం చేస్తున్నారు.? డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయకుండా ఎక్కడున్నారు..? అంటూ నిలదీస్తారు..? అయితే మనం మాత్రం మన బాధ్యతలను వదిలేసి.. అదేశాలను తుంగలో తోక్కేసి.. పీకలదాకా మద్యం తాగేసి.. స్నేహితులతో కలసి హంగామా చేసుకుంటూ వెళ్లిపోదామా..? ఇప్పడే తమ పిల్లలను నియంత్రించలేని పెద్దలు.. ఏదో జరిగిన తరువాత పోలీసులను, కారులో వున్న స్నేహితులను మాత్రం ఆ తదుపరి ఘటనలకు బాధ్యుల్ని చేస్తాయడం సమంజసమేనా..?
మినీ భారత్ లా బాసిల్లుతున్న హైదరాబాద్ నగరంలో.. ఏక్కడా ఎలాంటి ప్రమాదకర ఘటనలు జరగకుండా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బాధితులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. కాగా, గత రాత్రి జూబ్లీహిల్స్ లో పీకల వరకు మద్యం సేవించిన యువతి, ప్రమాదకరంగా తన కారును నడుపుకుంటూ రావడంతో పాటు, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు దొరికిపోయిందr.
ఇక చివరి క్షణం వరకు తాను తాగలేదని వాదించిన యువతి.. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు అంగీకరించకుండా నానా హంగామా చేసింది. అప్పటికీ ఆమె స్నేహితులు వద్దని వారిస్తున్నా వినకుండా ఏకంగా పోలీసులనే చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయింది. జూబ్లీహిల్స్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ఆమెను పరీక్షలను నిర్వహించేందుకు ప్రయత్నించిన పోలీసులు.. అనేక తంటాలు పడాల్సివచ్చింది.
చివరికి ఎలాగోలా ఆమెకు పరీక్షలు నిర్వహించగా, అధిక మోతాదులో మద్యం తాగినట్టు నిరూపితం కావడంతో, ఆమె వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆమెను కోర్టులో ప్రవేశపెడతామని, కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులకు చెప్పు చూపించిన విషయమై, ఆమెను హెచ్చరించనున్నామని, తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మరో కౌన్సెలింగ్ ఇస్తామని అన్నారు. ఆ అమ్మాయి నిర్వాకమంతా మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more