దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ.. లక్ష్మీ పూజ చేసుకుని.. ఇంట్లోని వారందిరితో కలసి స్వీట్లు పంచుకుని టపాసులు పేలుస్తుంటే.. నగరంలోని ప్రముఖుల మాత్రం తమ కార్యకలాపాలను పక్కనబెట్టి భారీస్థాయిలో జూదానికి తెరతీశారు. వినడానికి విచిత్రంగా వున్నా.. ఇది పూర్తిగా నిజం. దీపావళి పర్వదినం రోజున హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఉత్తరభారతావనికి చెందిన కొందరితో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు, నగరానికి చెందిన వ్యాపారులు కూడా వున్నట్లు సమాచారం. దీపావళి రోజున పేకాట అడటం వీరికి అనవాయితీ. అయితే తెలంగాణ ప్రభుత్వం పేకట, క్లబ్ లపై ఉక్కపాదం మోపడంతో.. వీరంతా దీపావళి రోజున రహస్యంగా పేకట అడి అడ్డంగా దొరికిపోయారు.
కాగా విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారస్థులు రహస్యంగా పేకాట అడుతున్న సికింద్రాబాదులోని మారియట్ హోటల్ పై దాడులు నిర్వహించారు. పోలీసుల అకస్మాత్తు దాడులతొ బిత్తరపోయిన ప్రముఖులు ఇక చేసేది లేక వారికి లోంగిపోయారు. కాగా దాడుల నేపథ్యంలో అక్కడి తంతు చూసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆశ్చర్యపోయారు. సుమారు 17 రూముల్లో పెద్దఎత్తున పేకాడుతున్న 40 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, పేరొందిన ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆయా గదుల్లోంచి పెద్దఎత్తున కరెన్సీ, విదేశీ కరెన్సీ, విదేశీ మద్యం, హుక్కాలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గత మూడు రోజులుగా ఈ హోటల్ లో మకాం వేసి పేకాడుతున్నట్టు తెలుస్తోంది. పేకాడేందుకు వీరందర్నీ ఏకతాటిపై చేర్చింది, హోటల్ లో పేకాట కోసం వారం రోజులపాటు 17 రూమ్ లను బుక్ చేసింది సంజయ్, ప్రవీణ్ అనే వ్యక్తులని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more