తెలంగాణలోని ప్రభుత్వం గతానికి విభిన్నంగా రాష్ట్ర అడపడచులకు సారేగా పంచిన చీరలపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మహిళలు నిరసనను వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో మహిళలు ఈ చీరలను కట్టుకోవాలా..? అంటూ ఏకంగా రాస్తారోకోలు నిర్వహించి నిప్పంటించారు. ప్రభుత్వం కానుకగా ఇచ్చిన చీరలు నాసిరకంగా వున్నాయంటూ ధ్వజమెత్తారు. నిరసనల్లో పాల్గోన్న మహిళలు తెలంగాణ ప్రభుత్వం అడపడుచులకు చీరలని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని లోపభూయిష్టమైన చీరలను పంపిణీ చేసిందని మండిపడ్డారు.
ఇక మరికోందరు మాత్రం నిజామాబాద్ ఎంపీ ఇలాంటి చీరలనే కట్టుకుంటుందా..? లేక తమను చులకన చేయాలనే ఇలాంటి చీరలను పంచారా..? అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసేది చేనేత పనులకు కానీ అడపడచులకు పంచేది మాత్రం నాసిరకం పాలిస్టరు చీరలా అంటూ నిలదీస్తున్నారు. రూ.222 కోట్ల రూపాయలను వెచ్చింది.. సుమారుగా కోటి నాలుగు లక్షల 47 వేల 610 చీరలను పంచాలని నిర్ణయించుకున్న ప్రభుత్వానికి వ్యతిరేక సెగను అసలు ఊహించలేదు.
అయితే చేనేత శాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వం ప్రచారమే కాదు.. చేనేతను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సుమారు 52 లక్షల చేనేత చీరలను సేకరించి పంపిణీ చేసిందని.. వీటన్నింటినీ సిరసిల్ల చేనేత నుంచే కొనుగోలు చేసిందని చెప్పారు. దీంతో సిరిసిల్ల సహా పరిసర ప్రాంతాల్లోని చేనేతలకు రూ. 70 కోట్ల మేర వ్యాపారం జరిగిందని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండుకు సరిపడా చీరలు అందుబాటులో లేకపోవడంతో అధిక భారమైనా పాలిస్టర్ చీరలను కొనుగోలు చేసి పంపించామని పేర్కోన్నాయి.
ఇక ఇటు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఇచ్చే కానుకలను అందుకునేందుకు మహిళలు ఏకంగా సిగపట్లు పట్టారు. ముష్టిగాతాలకు కూడా తెరలేపారు. సైదాబాద్ లో చీరల పంపిణీలో కొందరు మహిళలు ఘర్షణకు దిగారు. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మహిళా కానిస్టేబుల్ ఒక్కరే ఉండడంతో ఘర్షణను అడ్డుకోలేకపోయారు. ఉదయం నుంచి చీరల కోసం వేచి చేస్తుండగా, కోందరు క్యూలైన్ల మధ్యలోకి వెళ్లడంతో.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు తెరలేచింది. సుమారు పది నిమిషాల పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ వీరంగం సృష్టించారు.
మహిళల ఘర్షణ పడుతుండడంతో అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఘటనాస్థలంలోని పోలీసులు అడవారిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియకపోయినా.. అడ్డుగా నిలుస్తూ.. రెండువర్గాలను విడిపించారు. అయినా మరోచోటు ఈ గ్రూపులోని సభ్యులు ఖయ్యానికి సై అన్నారు. సైదాబాద్ శిశుమందిర్ లో పాఠశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళికారాహిత్యం కొట్టోచ్చినట్టు కనిపించిందని విమర్శలు వినవస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more