బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన అధికార పరపతిని వినియోగించి కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా కొనసాగిన హాయంలో అక్రమాలకు పాల్పడ్డారని, అతనితో పాటు అతని కుడమారుడు కూడా అవకతవకలకు పాల్పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక బీహార్ లో అర్జేడీతో అధికార జేడీయు పోత్తుకు తెరపడుతుందని అంతా భావించారు. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ను పదవిలోంచి దిగిపోవాల్సిందిగా నాలుగు రోజుల సమయాన్ని కూడా బీహర్ సీఎం నితీష్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి.
ఈ తరుణంలో ఆయన.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ తరువాత ఆయన ఉన్నఫలంగా మాట మార్చారు. అర్జేడీతో తాము మైత్రిని ఎందుకు వదులుకుంటామని ప్రశ్నించారు. అర్జేడీకి కటీఫ్ చెప్పే అవకాశాలే లేవని ఆయన స్పష్టం చేశారు. లాలూతో కలసి పెంచుకున్న బిడ్డే 'మహాఘటబంధన్' అని అభివర్ణించిన ఆయన, తన బిడ్డను తానే ఎలా చంపుకుంటానని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో టెలిఫోన్ లో మాట్లాడిన ఆయన, ఆపై తన మనసులోని మాట చెప్పారు. తెగదెంపులు ఉండబోవని కుండబద్దలు కొట్టారు.
లాలూ కుటుంబంపై సీబీఐ దాడులు, అంతకన్నా ముందు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ను కాదని, మోదీ ఎంపిక చేసిన కోవింద్ కు మద్దతు పలకడం తదితర పరిణామాలతో నితీశ్, లాలూ మధ్య బంధం విడనుందని, ఆ తరువాత బీజేపీ మద్దతుతో నితీశ్ ప్రభుత్వం కొనసాగుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక లాలూ ఇళ్లపై సీబీఐ దాడులు మొదలైన తరువాత, తొలిసారిగా క్యాబినెట్ సమావేశాన్ని నితీశ్ ఏర్పాటు చేయగా, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా హాజరయ్యారు. ఆపై ఆయన మాట్లాడుతూ, అమిత్ షా, నరేంద్ర మోదీలు తమ కుటుంబంపై కక్ష కట్టారని ఆరోపించారు. నితీశ్ తాజా వ్యాఖ్యలతో తేజస్వీ యాదవ్ పదవికి, ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు లేనట్టే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more