ఆ రాష్ట్రం వారికి చేపల కూర అంటే ప్రాణం. ఓ విధంగా చెప్పాలంటే ఆ రాష్ట్రం వారు చేపలతో 365 రకాల తీపి పదార్థాలను కూడా వండుకుని తినగలరు. దీన్ని బట్టి వారికి చేపలంటే ఎంత ఇష్టమో అర్థమైతుంది కదూ. సాధారణంగానే వారు చేపలంటే చెవికోసుకుంటారు. మరి అందునా ఫుల్ గా మద్యం సేవించి ఉన్నాక.. తమ పోరుగువారు చేపల కూర వండుకున్నారని తెలస్తే ఇంకేమైనా వుందా..? మాకు కొంచెం పెట్టరూ అని అడగటం వేరు.. మాకు చేపల కూర కావాలని డిమాండ్ చేయడం వేరు. ఇంకేముంది నిన్నమొన్నటి దాక అన్నదమ్ములా కలసివున్న కార్మికులు కాస్తా.. వైరివర్గమైపోయారు. చేపల కూర వండుకుని తింటున్నవారిపై దాడులకు తెగబడ్డారు.
భద్రాచలం పోలీస్స్టేషన్ ఏఎస్సై బి.హరిసింగ్ తెలిపిన వివరాలు మేరకు వివరాలిలా వున్నాయి. గోదావరిపై జరుగుతున్న రెండవ వారధి నిర్మాణ పనుల నిమిత్తం బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన పలువురు కార్మికులు వలస పనిచేస్తున్నారు. బీహార్కు చెందిన కార్మికులు చేపలు తెచ్చుకొని వంట చేసుకొని తినటానికి సిద్ధంకాగా, మద్యం సేవించి అప్పుడే అక్కడకు వచ్చిన పశ్చిమ బెంగాల్ కార్మికులు తమకు కూడా చేపల కూర కావాలని డిమాండ్ చేశారు.
తాము డబ్బులు పెట్టుకుని చేపలు కొని కూర చేసుకుంటే ఏకంగా 12 మంది వచ్చి తమకు చేపల కూర కావాలని డిమాండ్ చేయడంతో బీహార్ కార్మికులు ఇచ్చేది లేదని చెప్పారు. దీంతో ఇరురాష్ట్రల కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతే పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికులు ఆగ్రహంతో అక్కడే ఉన్న కర్రలు, ఇనుప రాడ్లతో వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురిని సెక్యూరిటీ సిబ్బంది పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more