తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది ఘటనతో యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెలోని నిందితుడి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. పెళ్లి సంబంధం కుదరడంతో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్న గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయడంతో గాయత్రి బంధువులు నిందితుడి ఇంటి వద్ద అందోళనకు దిగారు. అవేశంతో రగిలిపోతున్న గాయత్రి బంధవులు నిందితుడి ఇంటిలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గాయత్రి తండ్రి సూదగాని సాయిలు.. తాము ఇంట్లో లేని సమయం కోసం ఎదురుచూసిన శ్రీకాంత్ తమ అమ్మాయిని హత్య చేశాడని చెప్పారు. తాము ఇంట్లో ఉంటే మమ్మల్ని కూడా చంపేవాడని, అయితే తాము వుండివుంటూ తమ బిడ్డ అర్థాతరంగా హత్యకు గురైయ్యే అవకాశాన్ని మాత్రం ఇచ్చేవారం కాదన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడేందుకు శ్రీకాంత్కు అతడి స్నేహితులు సహకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్ తో పాటు అతడి స్నేహితులను కూడా అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశాడు.
యాద్రిద్రి జిల్లా యాదగిరి గుట్ట వద్ద జైగౌడ సంఘం అధ్వర్యంలో గౌడ కులస్థులు అందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రేమ చిచ్చు పచ్చని పల్లెల్లో కూడా అగ్గి రాజేస్తుందని, ఇలాంటి ప్రమోన్మాధుల వల్ల ఎంత మంది అభాగిణులు అసువులు బాయాలని ప్రశ్నించారు. తాను ప్రేమించనని తిరస్కరించినందుకు కూడా దారుణాలకు పాల్పడతారా.. అని వారు నిలదీశారు. వెంటనే నిందితుడ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో గౌడ కులస్థులు చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది, అందోళనకారులకు పోలీసులు నచ్చజెప్పి నిందితులను అరెస్టు చేస్తామనడంతో వారు శాంతించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more