ఉత్తర్ ప్రదేశ్ లో యువతులను, మహిళలను వేధిస్తున్న రోమియోల అటకట్టించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ.. వారికి అధికారులను కూడా అప్పగించిన ఉత్తర్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగీ అదిథ్యనాత్.. పలు సూచనలు కూడా చేశారు. అయితే సీఎం అదేశాలతో ఏర్పడిన ఈ బృందాలలో కొందరు తమ ఇష్టానుసారంగా యువకులపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనే ప్రేమజంటలు, యువజంటల వద్దకు వెళ్లవద్దని సీఎం సూచించినా.. అవి పట్టనట్లు వ్యవహరించారు.
యువతితో సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఓ యువకుడికి స్థానికుల సాయంతో యాంటీ రోమియో బృందం గుండు గీయించింది. అయితే యాంటీ రోమియో బృందం ఈ చర్యకు పాల్పడుతున్నా అడ్డుకోకుండా చూస్తూ ఉన్నందుకు ముగ్గురు పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది, వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. తన స్నేహితురాలిని కలిసేందుకు షాజహాన్పూర్లోని పబ్లిక్ పార్కుకు వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, అనంతరం అతడికి దగ్గరుండి గుండు చేయించారు. ముందుగా పార్కులో స్నేహితురాలితో ఉన్న యువకుడి వద్దకు వచ్చిన కానిస్టేబుళ్లు, యువతిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పారు.
అనంతరం ఒక బార్బర్ను అక్కడకు పిలిపించి యువకుడికి గుండు చేయించారు. ఆ యువకుడికి గుండు కొట్టించిన కానిస్టేబుళ్లు యాంటీ రోమియో స్క్వాడ్కు చెందిన సభ్యులు కాదని, ఈ ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే, సదరు బాధితుడి నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ చర్యకు పాల్పడ్డ కానిస్టేబుళ్లపై మాత్రం చర్యలు తీసుకున్నారు. ఈవ్టీజింగ్ పేరుతో యువతను ఇబ్బంది పెట్టొందంటూ పోలీసులకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. యాంటీ రోమియా స్వ్కాడ్ సిబ్బంది మోరల్ పోలిసింగ్ పేరుతో ఇలాంటివి చేయవద్దని హెచ్చరికలు జారీచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more