ఎన్నికలకు ముందు నాయకులు తమ నోటికి వచ్చిన హామీలను గుప్పిస్తారన్న విషయం తెలిసిందే. అందులో అచరణ సాధ్యమైనవి, కానివి కూడా వుంటాయి. అయినా సరే చేస్తాం.. అధికారాన్ని ఇవ్వండీ చేసేస్తాం అంటూ బల్లగుద్ది మరీ చెబుతారు. ప్రజలను పక్కదారి పట్టిస్తారు. అయితే ఇదోదే సాధారణ నాయకుడు చేస్తే పర్వాలేదు కానీ.. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్రమోదీ ఇలాంటి హామీనే గుప్పించి ఆనక చేతులెత్తేస్తే.. ప్రజలు విశ్వసించడం.. కుప్పలు తెప్పలుగా ఓట్లను వేయడం అన్ని జరిగిపోతాయి. ఆ తరువాత హామీని నిలబెట్టుకోకపోతే.. ఇదే జరిగింది.
ప్రధాని మోడీ తన హయంలో ఇచ్చిన అతి పెద్ద ప్యాకేజీ హామీ ఏకంగా లక్షా 25వేల కోట్లు. అర్థికంగా వెనుకబడిన రాష్ట్రం బీహార్.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో అఘమేఘాల మీద ప్రధాని ఈ హామిని బీహార్ రాష్ట్రానికి వెళ్లి మరీ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే ఈ ప్రకటన చేసి దాదాపు ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఒక్క పైసా కూడా విడుదలవ్వలేదంట. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటకొచ్చింది. ముంబయికి చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమ కారుడు అనిల్ గల్గాలి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్టీఐ దరఖాస్తు చేశారు.
అందులో ప్రధాని మోదీ చేసిన అతిపెద్ద హామీ ఏది అని, ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటీ అని అందులో ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్ పర్మార్ నేరుగా సమాధానం ఇచ్చారు. ‘బిహార్ ఎన్నికల ప్రచారం సమయంలో ఆ రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా గుర్తించి దాని పురోభివృద్ధికై మోదీ ఆగస్టు 18, 2015న రూ.1,25,003కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దశాల వారిగా నిధులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఒక పైసా కూడా విడుదల చేయలేదని చెప్పారు’ అని అనిల్ గల్గాలి వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more