కేంద్ర రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రైలు టికెట్ల బుకింగ్లో పెరిగిపోతున్న మోసాలను అరికట్టడంలో భాగంగా ఇక నుంచి ఆధార్ ను తప్పనిసరి చేయనుంది. త్వరలో ఆన్లైన్లో చేసుకునే టికెట్ల బుకింగ్కు ఆధార్ నంబర్ కంపల్సరీగా మారనుంది. రైల్వే సంబంధ నూతన వ్యాపార ప్రణాళిక 2017-18 ను గురువారం కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆవిష్కరించారు.
అందులో ఐఆర్సీటీసీ ద్వారా ఇంటర్నెట్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ నంబర్ నమోదం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. వయోవృద్ధులు టికెట్పై రాయితీ పొందాలంటే ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నంబరు సమర్పించాల్సి ఉంటుందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఆరువేల పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్), వెయ్యి స్వీయ టికెట్ విక్రయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సరుకు రవాణాపై ఆదాయాన్ని పెంచుకునేందుకు రాయితీలు ప్రకటించింది. కొండ ప్రాంతాల్లోని స్టేషన్లను కలుపుతూ ప్రత్యేకంగా కొత్త రైళ్లను ప్రారంభించనుంది.
తాజా ప్రణాళిక ప్రకారం..ప్రస్తుతం రైల్వేలో ఒక్కో సదుపాయానికి ఒక్కో యాప్ అందుబాటులో ఉంది.ఇకనుంచి అన్ని సేవలను ఒకేదాంట్లో అందించేలా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మే నెల నుంచి ఇది అందుబాటులోకి రానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more