నిరుద్యోగుల నిరసన ర్యాలీకి పిలుపు నిచ్చిన తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంటి తలుపులు పగుల గొట్టి మరీ ఆయన్ని బలవంతంగా తరలించారు. కోదండరాంతో పాటు మరో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కీలక నేతల అరెస్టు సమాచారంతో రాజధాని సహా రాష్ట్ర మంతటా ఉద్రిక్తత నెలకొన్నట్లయింది. అరెస్టులకు పాల్పడితే ఆయా పోలీస్ స్టేషన్లలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతామని జేఏసీ ఇప్పటికే ప్రకటించింది.
ఇక ర్యాలీకి అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జేఏసీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగోలులో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతివ్వబోగా ఆ పిటిషన్ ను జేఏసీ ఉపసంహరించుకుంది. సాయంత్రం కోదండరాం నివాసంలో చర్చించిన జేఏసీ ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలను యథాతథంగా శాంతియుతంగా నిర్వహిస్తామని పేర్కొంది. ఈ నిరసన కార్యక్రమానికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ లో మోహరించారు. ర్యాలీలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు కూడా.
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు శాంతియుత ర్యాలీకి టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ ర్యాలీకి అనుమతి లేదని, ఎవరూ హైదరాబాద్కు రావద్దని డీజీపీ అనురాగ్ శర్మ సూచించారు. ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని, అందుకే నిరుద్యోగ ర్యాలీకి అనుమతి లేదని అన్నారు. మరోవైపు హైదరాబాద్కు అదనపు పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ప్రధానంగా సుందరయ్య విజ్ఞానకేంద్రం, ఇందిరాపార్కు, ఓయూ పరిసరాల దగ్గర పోలీసులను భారీగా మోహరించారు.
ఇప్పుడు నేరగాళ్లం అయ్యామా? : కోదండరాం
ఇక తమపై నేరపూరిత కేసులు ఉన్నాయని, హింసకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారని నిన్న సాయంత్రం మీడియాతో తెలిపిన ప్రొ.కోదండరాం, తెలంగాణ సీఎం కేసీఆర్ కు చురకలు అంటించాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో కేసీఆర్తో పాటు తనపై 70 కేసుల వరకు ఉన్నాయని, వాటిలో కేసీఆర్ ఏ1, తాను ఏ2గా ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేశాడు. సాగరహారం, సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్ వంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నామని, వాటిల్లో పాల్గొన్నందుకే ఇప్పుడు తమను నేరగాళ్లు అంటున్నారని కోదండరాం ఆక్షేపించాడు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ఓ ప్లానింగ్ లేకుండా ముందుకు వెళుతుందన్న ఆయన, ఓ ప్రణాళిక ప్రకటించి, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించమని మాత్రమే తాము కోరామని తెలిపాడు.
నిజానికి ఫిబ్రవరి 1నే తాము ర్యాలీ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నామని, ప్రభుత్వంతో కాకుండా, నేరుగా డీసీపీ వద్దకు వెళ్లి అనుమతి కోరగా ఎలాంటి స్పందన లేదని వివరించాడు. ఆనాటి నుంచే తమపై వేధింపులు మొదలయ్యాయని కోదండరాం తెలిపారు. ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిరసన కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more