పార్లమెంటు లీడర్ గా కోనసాగుతున్న వ్యక్తి నరేంద్రమోడీకి అదే పార్లమెంటులోని సభ్యుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి అంశాలను ప్రస్తావించరాదన్న విషయం తెలియకపోవడం విచారకరమని అమ్ అద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ అవేదన వ్యక్తం చేశారు. ప్రధాని తాను చట్టసభలో కాకుండా బహిరంగ సభలో మాట్లాడుతున్నట్లు భావిస్తుంటారని అందుకనే నిత్యం అవతలివారిని చులకన చేయడం, వారిపై వ్యంగ్యస్త్రాలు సంధించడం చేస్తుంటారని దుయ్యబట్టారు.
తొటి పార్లమెంటు సభ్యుడి వ్యక్తిగత విషయాలను సభలో ప్రస్తావించరాదన్న విజ్ఞత కూడా ప్రధాని నరేంద్రమోడీకి లేదని అన్నారు. ప్రధానికి తన మద్యం సేవించడం విషయం అంత అవసరమా అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీపై సభాహక్కుల ఉల్లంఘన కింద పిర్యాదు చేస్తానన్నారు.మోదీ తన మర్యాదకు భంగం కలిగేలా మాట్లాడిన ఆ మాటలు వెంటనే రికార్డుల్లోనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఫిర్యాదు తప్పనిసరిగా చేస్తానని బెదిరించారు.
నలుగురిలో ఉండగానే భగవంత్ మన్ ఫుల్లుగా మద్యం సేవిస్తారని, పార్లమెంటుకు, బహిరంగ కార్యక్రమాలకు అలాగే వస్తారని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పలుమార్లు ఆయన ఆధారాలతో సహా దొరికిపోయారు. దీంతో ఆయన చాలాకాలం బతకాలంటే కాస్తంత హాయిగా వుండాలి. అందుకు నెయ్యి, పెరుగు లాంటి పదార్థాలు తీసుకోవాలి అని ప్రధాని పార్లమెంటులో ప్రస్తావించారు. దీంతో అసహనంతో బయటకు వచ్చిన మన్.. ప్రధాని నరేంద్రమోడీ ఓ ఉన్నతమైన స్థానంలో వున్న వ్యక్తి అన్న సంగతి మర్చిపోతున్నారని మండిపడ్డారు.
అలాంటి స్థానంలో వున్న వ్యక్తి స్థానానికి వున్న హుందాతనాన్ని పొగ్గొట్టేలా దిగజారి వ్యాఖ్యలు చేస్తారా..? అని ప్రశ్నించారు. సభ గౌరవాన్ని మంటగలిపారని వ్యాఖ్యానించారు. తనకు తాగుడు సమస్యే లేదని, ఇప్పటికిప్పుడు నిజాలు తెలుసుకోవాలంటే కచ్చితంగా ఆల్కామీటర్ పరీక్ష జరగాల్సిందేనంటూ ఆవేశంగా అన్నారు. ప్రధాని మాటలను రికార్డుల్లో నుంచి తొలగించకుంటే తాను ఫిర్యాదు తాను ప్రివిలేజ్ కమిటీకి వెళతానని భగవంత్ మన్ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more