నోట్ల రద్దు అనంతర పరిణామాలపై రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల రద్దు విషయంలో ఇప్పటికే అప్రతిష్టపాలైన ఆర్బీఐలో.. కేంద్ర ప్రభుత్వం మరింతగా జోక్యం చేసుకోవడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఆర్బీఐలో పనిచేస్తోన్న దాదాపు 18 వేల మంది అధికారులు, ఉద్యోగులు తేల్చిచెప్పారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్కు ఘాటు లేఖ రాశాయి. నగదు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారులను నియమించడం ఆర్బీఐకి ఘోర అవమానమంటూ నిరసన తెలిపాయి.
1935లో ఆర్బీఐ ప్రారంభమైన నాటి నుంచి ఎనిమిది దశాబద్దాలకుపైగా స్వతంత్రప్రతిపత్తతో వ్యవహరించిందని, అలాంటి సంస్థ ప్రతిష్ఠ నేడు(నోట్ల రద్దుతో) మసకబారిందని ఉద్యోగులు తమ లేఖలో అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు విషయంలో సమర్థవంతంగా వ్యవహరించని కారణంగా ఆర్బీఐ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాఖ అధికారులు వచ్చి పెత్తనం చెలాయించాలనుకోవడం అవమానకరమని లేఖలో పేర్కొన్నారు. ఆర్బీఐ ప్రతిష్ఠను దిగజార్చే నిర్ణయాలను వ్యతిరేకిస్తామని తెలిపారు. ‘ది యూనియన్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్’ పేరుతో విడుదలైన లేఖ ప్రస్తుతం బ్యాంకింగ్, ఆర్థిక శాఖ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశమైంది.
గవర్నర్కు పంపిన లేఖపై ఆల్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బాధ్యుడు సమీర్ ఘోష్, రిజర్వ్ బ్యాంక్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సూర్యకాంత్ మహాదిక్, ఆల్ ఇండియా రిజర్వ్బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున సి.ఎం.ఫౌజిల్, ఆర్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఆర్.ఎన్.వత్స తదితరులు సంతకాలు చేశారు. ఆర్బీఐలో నగదు నిర్వహణకు ఆర్థిక శాఖ తరఫున అధికారిని నియమించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్లు బిమల్ జలాన్, వైవీ రెడ్డి, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు ఉషా థొరాట్, కె.సి.చక్రవర్తి తదితరులు బాహాటంగానే తమ నిరసన తెలియజేశారు. అధికారులు, ఉద్యోగుల లేఖపై ఆర్బీఐ గవర్నర్ స్పందన తెలియాల్సిఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more