తమిళనాట ప్రజలు అప్యాయతతో ముద్దుగా పిలుచుకునే పురచ్చి తలైవి, అమ్మ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఈ నెల 5న అకస్మిక మరణించడంతో రాష్ట్రంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జయలలిత మరణం విషయంలో పలు అనుమానాలను వ్యక్తం చేసిన పార్టీ బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప.. తాను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి కూడా పోటీలో నిలబడతానని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆమె న్యాయవాదిపై అన్నాడీఎంకే కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
దీంతో చెన్నయ్లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శశికళా పుష్ప న్యాయవాదిని అక్కడి నుంచి రక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే అప్పటికే రక్తపు గాయాలపాలైన ఆయనను అస్పత్రికి తరలిచారని సమాచారం. అన్నాడీఎంకే పార్టీ ప్రాధాన కార్యదర్శిగా శశికళే బాధ్యతలు చేపడతారన్న ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు.
శశికళ పుష్ప తరపున పార్టీ కార్యాలయాలనికి వచ్చిన ఆయన అమె తరపున ఓ నోటీసును కార్యాలయ వర్గాలకు అందించేందుకు వచ్చారని తెలుస్తుంది. అయితే, ఆయనను చూడగానే ఎందుకోచ్చాడన్న వివరాలను సైతం అగడకుండా అతనిపై అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. న్యాయవాదిపై దాడి వార్తను అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more