గోల్డ్డ్రాప్ పేరుతో వంటనూనెలను విక్రయిస్తున్న లోహియా గ్రూపు మరో కొత్త ఉత్పాదనతో ముందుకు వచ్చింది. న్యూ గోల్డ్ డ్రాప్ రైస్ బ్రాండ్ పేరుతో రూ పొందించిన వంటనూనెలను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. బుధవారం జరిగిన ఆవిష్కరణ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా లోహియా సంస్థల మేనేజింగ్ డైరక్టర్ మహవీర్ లోహియా మాట్లాడుతూ... ఇప్పటిదాకా సన్ ఫ్లవర్, వేరుశనగ మరియు పామ్ అయిల్ ను అందిస్తున్న సంస్థ ఇక నుంచి శ్రేష్టమైన రైస్ బ్రౌన్ అయిల్ ను కూడా అందించబోతుందని ప్రకటించాడు. తెలుగు రాష్ట్టాల్లో ఏడాదికి 85 కోట్లతో ఈ ఉత్పాదన జరపనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతానికి ఈ ప్రీమియం రైస్ బ్రాండ్ ఆయిల్ను ప్రస్తుతానికి తెలుగు రాష్ర్టాల్లో మాత్రమే విక్రయిస్తున్నట్లు, దశలవారీగా దక్షిణాది మార్కెట్లో విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. లీటర్ నూనె ధర 180 రూపాయలుగా నిర్ధారించారు.
దేశవ్యాప్తంగా వంటనూనెలకు పెరుగుతున్న డిమాండ్తో వచ్చే నాలుగేండ్లలో టర్నోవర్ రూ.5 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.2,500 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరగనున్నదని చెప్పారు. రూపాయి మారకం విలువ భారీగా తగ్గడంతో త్వరలో వంటనూనె ధరలు రూ.1-2 మేర పెరిగే అవకాశం ఉందన్న ఆయన, దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న వంటనూనెలో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఇందుకు కారణమన్నారు. అలాగే ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పంట కూడా అందుబాటులోకి రానుండటంతో ధరలు భారీగా పెరిగే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడనున్నదని, ముఖ్యంగా అమ్మకాలు 15-20 శాతం పడిపోయే అవకాశం ఉందని వివరించారు.
ఈ కార్యక్రమంలో లోహియా ఇండస్ట్రీస్ చైర్మన్ కన్హయ్యలాల్ లోహియాతోపాటు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, వాల్యూ ఫార్మా అండ్ వెన్ సాఫ్ట్ సంస్థల అధినేత దిలీప్ చక్రవర్తి బైరా తదితరులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more