కాలేజీలో కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. కరెన్సీ నోట్లంటే ఎదో ఒకటో రెండు కాదు కట్టలు కట్టలు కోద్ది డబ్బుల కట్టలు బయటపడటంతో అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. విద్య వ్యాపారంగా మారిపోయిందని అనేక విమర్శలు వస్తున్న తరుణంలో మరీ ముఖ్యంగా మెడికల్ విద్య అంటే కాసుల వర్షం కురిపించే విద్యగా పేరొందింది. ఈ తరహా కథానాల నేపథ్యంలో ఓ మెడికల్ కాలేజీపై దాడులు చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఇవి కథనాలు మాత్రమే కాదు వాస్తవాలు అని అర్థమైంది. బెంగళూరు వైట్ఫీల్డ్లోని వైదేహీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్పై దాడి చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులకు కళ్లు చెదిరిపోయాయి.
ఒకటో రెండో కాదు కట్టల కొద్దీ బయటపడిన సొమ్ము దాుడల్లో బయటపడటంతో వారు ఖంగుతిన్నారు. రూ.500, రూ.1000 నోట్లు బయటపడుతున్న తీరు చూసి అవాక్కయ్యారు. ఆ మొత్తాన్ని తరలించేందుకు ఏకంగా ట్రక్కునే రప్పించాల్సి వచ్చింది. మొత్తంగా ఐటీ అధికారుల దాడిలో లెక్కల్లో చూపని, అక్రమ ఆదాయం రూ.43 కోట్లు బయటపడింది. దేశంలోనే ఇది రెండో అతిపెద్ద దాడిగా అధికారులు చెబుతున్నారు. గతంలో పాండిచ్చేరిలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలపై దాడి చేసిన ఐటీ అధికారులు అప్పట్లో రూ.82 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద దాడి కాగా, తాజా దాడి కర్ణాటకలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు.
కళాశాలపై దాడి చేసిన అధికారులు డబ్బుతో పాటు పలు పత్రాలను, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా క్యాపిటేషన్ ఫీజు రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మేనని అధికారులు భావిస్తున్నారు. వైదేహీ గ్రూప్ చైర్మన్గా ఉన్న చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు మరణానంతరం ఆయన కుమార్తె కల్పజ, వైదేహీ కళాశాలను నిర్వహిస్తున్నారు. సంస్థ అక్రమ ఆదాయంపై పక్కా సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఉన్న ఆదికేశవులు గ్రూప్ కంపెనీలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పలుపత్రాలతోపాటు భారీగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.265 కోట్లకు ఆదాయపు పన్నులు చెల్లించకుండా లావాదేవీలు నిర్వహించినట్టు అధికారులు అంచనాకొచ్చారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more