ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో నిల్చొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు సీఎం మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో ప్రదర్శించిన వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎందరో మహనీయులను స్మరించుకోవాల్సి ఉందన్నారు. అయితే ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికలకు మందు, ఆ తరువాత పలు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదని తూర్పారబట్టారు. ముఖ్యంగా రాష్ట్రానికి కల్పిస్తామన్న ప్రత్యేక హోదాను మోడీ సర్కార్ విస్మరించిందని అన్నారు. రాజధానికి నిర్మాణంతో పాటు రాష్ట్ర అభివృద్ది కోసం ప్రతీ ఒక్కరు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ భరోసా పేరుతో పేదవారికి పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అగ్రవర్ణాల్లో పేదవారికి రిజర్వేషన్ల అమలును పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
రాయలసీమ అంటే ముఠా కక్షలు అనే అపవాదు ఉందని....రాయలసీమ రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జిల్లాలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలో సీఎం పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాయలకాలం నుంచి అనంతపురానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. అనంతపురం జిల్లా ప్రముఖుల పేర్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనంతపురం అంటే ఎన్టీఆర్కు ఎంతో అభిమానం ఉండేదని చంద్రబాబు గుర్తుచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more