చౌకధర విమానయాన యుద్దంలో గతంలోనే ప్రవేశించిన చౌకదర విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా.. తమ కస్టమర్లకు మరోసారి బంఫర్ ఆఫర్ ప్రకటించింది. మలేసియాకు చెందిన ఈ విమానయాన సంస్థ భారత్లో సర్వీసులు ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ తమ విమానయాన టికెట్లపై వార్షికోత్సవ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. దేశవాళీ, అంతర్జాతీయ విమాన సర్వీసుల టికెట్ ధరలకు చౌకధరలకు తీసుకునే వెసలుబాటు కల్పించింది. రెండేళ్ల వార్షికత్సవ ఆఫర్ లో భాగంగా మరోమారు చౌకధర యుద్దానికి తెరతీసింది.
గతంలో దేశీయ విమాన సర్వీసులలో ప్రయాణాన్ని 1199 రూపాయలకే ప్రకటించిన ఎయిర్ ఏషియా తాజాగా వార్షికోత్సవ ఆపర్ ను మరింత డిస్కౌంట్ అందించింది. తాజా వార్షికోత్సవ డిస్కౌంట్ ఆఫర్ ప్రకారం దేశీయ విమాన సర్వీసుల కనిష్ట టికెట్ ధర పన్నులతో సహా 899 రూపాయలగా ప్రకటించింది. అయితే ఈ ధర కేవలం బెంగళూరు, జైపూర్, కోచి, న్యూఢిల్లీ, పుణె వంటి నగరాల మధ్య నడిచే విమాన సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
దీంతో పాటు విదేశీ ప్రయాణాలపై కూడా డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. బాలి, బ్యాంకాక్, కౌలాలంపూర్, మెల్బోర్న్, పెర్త్, సింగపూర్లకు వెళ్లే విదేశీ సర్వీసుల్లో కనిష్ట టికెట్ ధరను 3399 రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల 19 వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కాగా టికెట్ బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో ప్రయాణించాల్సి వుంటుందని విమాన యాజమాన్య వర్గాలు పేర్కోన్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more