తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు ఇవాళ వేకువ జామున దర్శించుకున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యులు సచిన్ టెండుల్కర్ దంపతులతో పాటు మరో రాజ్యసభ సభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ హీరో నాగార్జున, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో పాటు పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వారికి ఆలయంలోకి స్వాగతం పలికారు.
ఇందుకోసం క్రితం రోజు రాత్రే వీరంతా తిరుమలకు చేరుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, ఆయన సతీమణి అంజలి టెండుల్కర్ తిరుమల చేరుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు ప్రత్యేక విమానంలో నిన్న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. వారు తమ కారులో ముందుగా తిరుమల బయల్దేరి వెళ్లగా, ఆ తరువాత చిరంజీవితో పాటుగా తెలుగు సినీ ప్రముఖులు బయలుదేరి వెళ్లారు.
ఇవాళ వెకువ జామును వీరంతా కలసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, ఆయనకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఇదిలా వుండగా త్వరలో వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో, భక్తులు తీరుమలకు పోటెత్తుతున్నారు. ఇవాళ కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more