సమైక్య రాష్ట్రంలోనూ ఉప ఎన్నికల ద్వారా తమ సత్తా చాటిన టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ అదే తరహా విజయాన్ని అందించారు తెలంగాణ ప్రజలు. ప్రత్యేక రాష్ట్రంలో నారయణ ఖేడ్ తరువాత పాలేరులోనూ అక్కడి ఓటర్లు అధికార టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. పాలేరు ఉప ఎన్నిక ఫలితాలలో నియోజకవర్గ రికార్డు మెజార్టీ సాధించిన తెలంగాన మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభినందించారు. తుమ్మలను గెలిపించిన పాలేరు ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే ఇంతకుముందు 1972లో కాంతయ్య 25452 మెజారిటీతో గెలిచారు. ఇంతకుమించి ఎవరికీ మెజారిటీ రాలేదని.. మళ్లీ ఇన్నాళ్లకు తుమ్మల 45వేలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు నిరంతరంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విజయం ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత బాధ్యతను పెంచింది. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలని సూచించారు.
పాలేరు ఉప ఎన్నికలో విజయం తమకు బాధ్యతను పెంచిందని, అయితే విజయగర్వంతో విర్రవీగుతూ ఉబ్బిపోయి అతి ప్రసంగాలు చేయకూడదని కూడా ఆయన కార్యకర్తలను చెప్పారు. మనల్ని గెలిపించిన ప్రజలకు మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తాను ముఖ్యమంత్రి అయిన ఐదో రోజు నుంచి టీఆర్ఎస్ మీద అర్ధసత్యాలు, అసత్యాలతో పసలేని పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఇది సమంజసం కాదన్నారు. మిషన్ కాకతీయాను కమీషన్ కాకతీయగా అభివర్ణించిన విపక్షాలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని కోరుతున్నానని కేసీఆర్ అన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more