యుపిఎ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం ఇంకా కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును వదలడం లేదు. గతంలో తాను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని. అంతా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే చేశారని తెలిపారు. కానీ సీబీఐ కోర్టు మాత్రం దానిని తిరస్కరిస్తూ.. తాజాగా సీబీఐ సమర్పించిన ఆధారలను పరిశీలించింది. అందులో నాటి మంత్రి దాసరి కావాలనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కు అనుకూలంగా చర్యలకు దిగారని సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. అయితే దీనిపై జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ లిమిటెడ్ ఓనర్ తో పాటుగా దాసరిని, నాటి కొంత మంది ఉన్నతాధికారులను వివిధ సెక్షన్ ల కింద విచారించాలని ఆదేశించింది.
నవీన్ జిందాల్ కు చెందిన కంపెనీలకు బొగ్గు కేటాయింపులు జరిగేలా నాటి జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా పావులుకదిపినట్లు తెలుస్తోంది. బొగ్గు కేటాయింపుల మీద నాటి సిఎస్ ఇచ్చిన నివేదికనుకాదని, మధుకోడా స్వయంగా కొన్ని కంపెనీలను షాట్ అవుట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫైల్ ను కేంద్రానికి పంపగా, కేంద్రంలో ఉన్న దాసరి నారాయణ రావు వాటికి కావాల్సిన కేటాయింపులు జరిగేలా చేశారని తెలుస్తోంది. కాగా ఇందుకు దాదాపు 2 కోట్లు ముట్టినట్లు, వాటిని వివిధ కంపెనీలకు మళ్లించారని కంపెనీ అభిప్రాయపడింది. ఇది ఎంతో ప్రొఫెషనల్ గా చేసిన స్కాం అని కోర్టు అభిప్రాయపడింది. మొత్తానికి చాలా కాలంగా సాగుతున్న బొగ్గు స్కాంలో మరోసారి దాసరి చిక్కుల్లో పడ్డారు.. పడతారు అన్నది మాత్రం క్లీయర్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more