బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తీవ్రమైన కరువుతో అతలాకుతలమైన మహారాష్ట్ర రైతులను ప్రభుత్వాలు అదుకోకుండా, కేవలం ఆట కోసం లక్షల లీటర్ల నీటిని వినియోగించడంపై బొంబే హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది, కరువు, నీటి కొరత కారణంగా మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని ఆదేశించింది. ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఆ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఆ తర్వాత మహారాష్టలోని వాంఖేడ్, నాగపూర్, ఫూణే, ముంబై స్టేడియంలలో జరగాల్సిన అన్ని మ్యాచ్లనూ రాష్ట్రం నుంచి తరలించాలని బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామని, రోజు 40 లక్షల లీటర్ల కంటే ఎక్కువ నీటిని లాతూర్ లేదా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తామని బీసీసీఐ తరపు న్యాయవాది అంతకుముందు కోర్టుకు విన్నవించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, పుణె చెరో 5 కోట్లు రూపాయల చొప్పున సీఎం సహాయక నిధికి అందజేస్తాయని చెప్పారు. వాదనలు విన్న అనంతరం ఆరు మ్యాచ్ల నిర్వహణకు మాత్రమే కోర్టు అనుమతిచ్చింది.
మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్పూర్ వేదికల్లో మ్యాచ్లు జరగాల్సివుంది. దీంతో ఏప్రిల్ 30 లోపు మహారష్ట్ర వేదికగా కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే ఆ రాష్ట్రంలో నిర్వహించనున్నారు. హైకోర్టు తాజా ఉత్తర్వుల కారణంగా మరో 13 మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మహారష్ట్రకు రావాల్సిన కోట్ల రూపాయల అధాయం హరించుకుపోనుంది, అయితే కోర్టు తీర్పు పట్ల రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి, మ్యాచ్ లకు వినియోగించే నీటిని రైతులు సాగుకు వినియోగిస్తారని రైతు సంఘాల నేతలు పేర్కోన్నారు
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more