యమునా ఎక్స్ ప్రెస్వేపై ఈ నెల 5న శనివారం రాత్రి జరిగిన ప్రమాదానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాన్వాయే కారణమని, తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూలో ప్రమాదంలో మృతిచెందిన బాధితుడి కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఆగ్రాకు చెందిన వైద్యుడు రమేష్ నగర్ మృతి చెందగా, పలువురు చిన్నారులు గాయపడిన విషయం తెలిసిందే. అయితే స్మృతి ఇరానీ కాన్వాయ్ కారు రెండు పర్యాయాలు తమ తండ్రి వాహనాన్ని ఢీ కోనడంతోనే ఆయన మరణించాడని, లేని పక్షంలో ఆయన బతికేవారని మృతుడి కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి స్మృతి ఇరానీ పై చర్య తీసుకోవాలని మృతిచెందిన డాక్టర్ కుమారుడు అభిషేక్ నగార్ తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభిషేక్, ప్రణబ్ ను కోరాడు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రమాదానికి జరిగిన తన కాన్వాయ్ డ్రైవర్ ను పూర్తిగా ఘటన నుంచి తప్పించేందుకు మంత్రి హోదాలో యత్నిస్తున్నారని అరోపించారు. అసలు ప్రమాదానికి, కేంద్ర మంత్రి కాన్వాయ్ కు ఎలాంటి సంబంధంలేదని పోలీసులు కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శణమని పేర్కోన్నారు.
తమ ఫిర్యాదులో కాన్వాయ్ నెంబర్ పేర్కొన్నప్పటికీ మథుర పోలీసులు అందుకు నిరాకరించారని రాష్ట్రపతికి రాసిన లేఖలో అభిషేక్ పేర్కొన్నాడు. ఆ వాహనం నెంబర్ డీఎల్ 3సీ బీఏ 5315 (DL 3C BA 5315) అని వెల్లడించాడు. తన తండ్రి ఓ వివాహానికి బైక్ పై వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో తన కూతురు సాందిలి(12), మరో చిన్నారి పంకజ్(8) గాయపడ్డారని వివరించాడు. మంత్రి కాన్వాయ్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, స్మృతి ఇరానీ ఆ గాయపడ్డ ఇద్దరు చిన్నారులను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయిందని తమకు న్యాయం చేయాలని తన లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more