వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారన్న వార్త మీద ఆమె ఘాటుగా స్పందించారు. ఏం చూసి టీడీపీలోకి చేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కౌరవులకన్నా ఒక సంఖ్య ఎక్కువే ఉన్న మీరంతా చేస్తుంది ఓ పనికి రాని పాలన అని ఆమె దుయ్యబట్టారు. ప్రజలంతా టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటున్నారని, అలాంటి ఎమ్మెల్యేలున్న పార్టీలోకి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా చేరతారని ప్రశ్నించారు.
అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఓ మునిగిపోయే నావ అని.. దానిలోకి ఎవరు ఎక్కుతారని రోజా మండిపడ్డారు. హైదరాబాద్ ను నెంబర్ వన్ తానే చేశానని చెప్పుకుంటే నిజంగానే ప్రజలు ఆయనకు ఒక్కటే సీటు మిగిల్చారని వ్యాఖ్యానించారు. ఏపిలో కూడా టిడిపికి రెండు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే మిగులుతాయని అన్నారు. చంద్రబాబునాయుడి పార్టీ ఓ మునిగిపోయే పడవ అని అందులోకి ఎవరు పోయినా మరింత వేగంగా అది మునిగిపోతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీలో ఉన్నవారంతా తామున్నది పల్లకిలో అని భావిస్తున్నారని, అది పాడే అనే విషయం త్వరలోనే తెలుస్తుందని రోజా చెప్పారు. ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే సస్పెన్షన్ వేశారు, లేదంటే కేసులు పెట్టారు, ప్రలోభాలు పెట్టారు.. కానీ ఒక్కరైనా నీ పార్టీలోకి వచ్చారా? అని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more