అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారంనాడు హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఆస్తులు వేలం వేస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కోర్టుకు వివరించింది. ఎమ్ఎస్ టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్ మెంట్ టెక్నాలజీకి వేలం బాధ్యతలు అప్పగించామని కమిటీ తెలిపింది. మొదటి విడతలో సంస్థకు చెందిన ఆరు ఆస్తులను వేలం వేయనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఎమ్ఎస్ టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్ మెంట్ టెక్నాలజీలలో ఒక్కో సంస్థకు రెండు ఆస్తులు వేలం వేసేందుకు అప్పగిస్తామన్నారు. ఇందుకు సంబంధించి మూడు వారాల్లో వెబ్ సైట్ ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, టెండర్ల వివరాలను అందులో పొందుపరచాలని హైకోర్టు ఆదేశించింది. తొలి విడత వేలంలో రూ.3,500 కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ సంస్థ కోర్టుకు వివరించింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్-బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారంనాడు హైకోర్టులో విచారణకు రాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more