ఐసిస్ అంటే అందరికి భయం.. ప్రపంచంలో అతి కిరాతక ఉగ్రవాద ముఠా. అయితే ప్రపంచ దేశాలు ఇప్పుడే ఐసిస్ మీద యుద్దానికి సిద్దమవుతున్నాయి. అయితే అందరికి భయాన్ని పుట్టిస్తున్న ఐసిస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఓ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 హత్యలు చేసిన ఓ వ్యక్తి గురించి. అవును ఐసిస్ ఉగ్రవాదులను హతమారుస్తున్న ఇరాకీ రాంబో అబూ అజ్రేల్. జీహాద్ పేరుతో నరమేధం సృష్టించడమే పనిగా పెట్టుకున్న ఐసిస్ ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నం. ఐసిస్ ముష్కరులతో పోరాడుతున్న ఇరాకీ షియా యోధులకు ఆరాధ్య దైవం. ఇప్పటి వరకు దాదాపు 1500 మంది టెర్రరిస్టులను హతమార్చాడు.
ఐసిస్. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపిస్తామంటూ మారణహోమం సృష్టించే రాక్షస సంస్థ. ఇరాక్, సిరియాల్లో అనేక ప్రాంతాలను ఆక్రమించిన ఈ ఉగ్రవాదులు ప్రపంచానికే శత్రువులుగా మారారు. వీరిని అంతం చేయడానికి పాశ్చాత్యదేశాలు సిరియాలో వైమానికి దాడులు చేస్తున్నాయి. మరోవైపు, ఇరాక్ భూతలంలో వీరికి ఎదిరించే రెబెల్స్ కొందరున్నారు. వారంతా షియా ఫైటర్లు. కతేబ్ అల్ ఇమాం అలీ అనే సంస్థ పతాకం కింద పోరాడుతున్నారు. ఐసిస్ అరాచకాలను అంతం చేయడం, ఆ ముష్కరులను కాల్చి చంపడం ఈ తిరుగుబాటు దారుల లక్ష్యాలు.
Also Read: ఐఎస్ఐఎస్ తదుపరి టార్గెట్ భారత్..? బీజేపీ విధానాలపై యుద్దం
ఐసిస్ ను ఎదుర్కొనే షియా తిరుగుబాటు దారుల్లో అబూ అజ్రేల్ ప్రత్యేకతే వేరు. అతడి నాయకత్వంలోని చిన్న పాటి సైన్యం ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నంగా మారింది. ఒకప్పుడు యూనివర్సిటీ లెక్చరర్ అయిన అబూ, ఆ తర్వాత ఐసిస్ అరాచకాలను చూసి తిరుగుబాటు దారుడిగా మారాడు. మార్షల్ ఆర్ట్స్ లోనూ అతడికి ప్రావీణ్యం ఉంది. అతడు తాయిక్వాండో చాంపియన్ కూడా. ఇరాకీ తిరుగుబాటుదారులు మృత్యుదేవుడు అని పిలిచే అబూ, ఇప్పటి వరకు దాదాపు 1500 మంది ఐసిస్ ఉగ్రవాదులను హతమార్చాడు. తుపాకీ ఎత్తాడా... దడదడమని తూటాలు దూసుకుపోవాల్సిందే. ముష్కరులు నేలకొరిగి హతం కావాల్సిందే. హాలీవుడ్ సినిమా రాంబోను తలపించే యుద్ధ నైపుణ్యం, తెగింపు ఉన్న అబూను ఇరాకీ రాంబో అని పిలుస్తున్నారు. రాంబో లాగే ముష్కరుల పనిపట్టే అబూ, ఇంకా వీలైనంత మంది టెర్రరిస్టును మట్టుబెడతానంటున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more