దేశంలో అసహనం అంతకంతకు పెరుగుతూ పోతుందంటూ వ్యాఖ్యాలు చేసిన బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ ఎట్టకేలకు దిగివచ్చాడు. భారతీయుడిని అయినందుకు తాను గర్విస్తున్నానని అన్నాడు. తనకు గానీ, తన భార్యకు గానీ భారతదేశం వదిలిపెట్టి వెళ్లాలని లేదంటూ ఒక ప్రకటన చేశాడు. ఇప్పటివరకు తాము ఎప్పుడూ అలా పారిపోలేదని, భవిష్యత్తులో కూడా వెళ్లాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు.
దేశంలో అసహనం పెరిగిపోతోందని, తన కొడుకు భద్రతపై ఆందోళనగా ఉన్నందున వేరే ఏదైనా దేశానికి వెళ్లిపోవాలని తన భార్య ఆందోళన వ్యక్తం చేస్తోందంటూ వ్యాఖ్యానించి అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఆమిర్ ఖాన్.. ఎట్టకేలకు దానిపై స్పందించాడు. తన ఇంటర్వ్యూ పూర్తిగా చూడనివాళ్లే కావాలని తన మీద బురదజల్లేందుకు ప్రయత్నించారని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నాడు.. తన ఇంటర్య్వూ పూర్తిగా చూసిన వాళ్లు తనను అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు.
భారతదేశం తన మాతృభూమి అని, తానీ దేశాన్ని ప్రేమిస్తున్నానని చెబుతూ, ఇక్కడ పుట్టినందుకు తనను తాను అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు తెలిపాడు. తాను ఇక్కడే శాశ్వతంగా ఉండబోతున్నట్లు స్పష్టం చేశాడు. అయితే, తాను ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతి అంశానికీ కట్టుబడి ఉన్నట్లు మరోసారి అన్నాడు. తన మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పినందుకు తనపై నిందలు వేస్తున్నారని, తద్వారా తాను చెప్పిన విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నందుకు చాలా విచారకరంగా ఉందని తెలిపాడు.
తనను జాతివ్యతిరేకిగా కొందరు చిత్రీకరిస్తున్నారని, అయితే భారతీయుడినైనందుకు గర్వపడుతున్నానని.. ఈ విషయంలో ఎవరూ తనను గుర్తించాల్సిన అవసరం లేదని ఆమిర్ అన్నాడు. తనకు ఈ దేశంపై ఎంత భక్తి వుందన్న విషయంలో ఎవరి ప్రోగ్రెస్ కార్డు తనకు అవసరం లేదని చెప్పారు. చివర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై' అనే పద్యంతో అమీర్ ఖాన్ తన ప్రకటనను ముగించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more