కారు .జోరుకు మిగిలిన పార్టీల అభ్యర్థులు కుదేలవుతున్నారు. వరంగల్ ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి.. హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల కోసం లెక్కింపు మొదలు కాగానే మొదటి రౌండ్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థి లీడ్ లో కొనసాగారు. ముందుగా పోస్ట్ బ్యాలెట్ లెక్కించగా అందులో మొత్తం టిఆర్ఎస్ పార్టీనే క్లీన్ స్వీప్ చెయ్యడంతో మంచి ఓపెనింగ్ వచ్చింది. దాంతో ముందు నుండి కూడా కారు జోరు మొదలైంది. మిలిగిన పార్టీల నాయకులకు కనీస ఓట్లు కూడా కనిపించడం లేదు. మొదటి నుండి టిఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉండగా తర్వాతి స్థానం కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి ఉన్నాడు.
వరగంల్ లోక్ సభ నియోజక వర్గంలో మొత్తం 15, 09.671 ఓట్లు ఉండగా అందులో 10, 44, 541 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తంగా 69.19 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక అందులో టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 96, 523 ఓట్ల లీడింగ్ కొనసాగిస్తున్నరు. ఇక సర్వే సత్యనారాయణ, బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి దేవయ్య, వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ లు వెనకుబడ్డారు. మొత్తంగా వరంగల్ ఎన్నికల్లో కారు పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోంది అన్నది క్లీయర్. కాగా ఇప్పుడు ఎవరు ఎంత ఘోరంగా ఓడిపోతారు అన్నదాని మీద బెట్టింగ్ లు నడుస్తున్నాయి. బిజెపికి డిపాజిట్లు కూడా దక్కవని కొందరు, కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు వస్తాయని మరికొందరు ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. కాగా వరంగల్ ఉప ఎన్నికల మీద ముందు నుండి పూర్తి దృష్టి సారించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రచారంతొ హోరెత్తించింది. మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని భుజస్కందాల మీద మోశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే చాలా సునాయాసంగా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపును కైవశం చేసుకోగలరు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more