ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. మోదీ అధికార నివాసం వెలుపల ఢిల్లీపోలీసు కానిస్టేబుల్కు చెందిన రైఫిల్ ప్రమాదవశాత్తు పేలడంతో భద్రతాధికారులు ఉలిక్కిపడ్డారు. కాల్పుల శబ్దం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. రేస్కోర్స్ రోడ్డు ఏడవ నంబరు నివాసం వద్ద డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ తుపాకీ మూడుసార్లు పేలడంతో అంతా అప్రమత్తమయ్యారు. ప్రధాని నివాసం ఎదురుగా ఉండే మీడియా పార్కింగ్ వద్ద పోలీసు కంట్రోల్ రూంలో రాత్రి ఈ సంఘటన జరిగింది. భద్రతా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రైఫిల్ లోడ్ చేస్తుండగా తుపాకీ పేలింది.
భద్రతా సిబ్బంది డ్యూటీలు మారే సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. మొదటిసారి తుపాకీ పేలిన తర్వాత ఐదారు నిమిషాలకు రెండోసారి, అరగంట తర్వాత మరోసారి పేలింది. కానిస్టేబుల్ తన ఏకే-47 లోడ్ చేసుకుంటుండగా అది మొత్తం మూడుసార్లు పేలిందని న్యూఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ తెలిపారు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆయన వివరించారు. కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రతి 12 గంటలకోసారి డ్యూటీ మారే సమయంలో ఆయుధాల అప్పగింత సాధారణమేనని, అయితే కాల్పులు మాత్రం సాధారణ విషయం కాదని అంటున్నారు.
సాంకేతిక సమస్య వల్ల తుపాకీ పేలిందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. కంట్రోల్ రూం వద్ద డ్యూటీ చేస్తున్న పారామిలిటరీ, పోలీసు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు కారణమైన తుపాకీని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటన వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండే అవకాశం లేదని పోలీసులు అంటున్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ గురువారం ప్రధాని కార్యాలయానికి, క్యాబినెట్ సెక్రటేరియట్కు సమగ్ర నివేదిక సమర్పిస్తారు. తుపాకీ కాల్పుల శబ్దం విన్న వెంటనే భద్రతాధికారులు హుటాహుటిన కంట్రోల్ రూంవద్దకు చేరుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more