ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటి మధ్యాహ్నం 12 గంటలకు కుదిరింది. నిన్న సిఎం అపాయింట్ మెంట్ కోరిన పవన్ కళ్యాన్.. సిఎం కార్యాలయం నుండి సానుకూల స్పందనను అందుకున్నారు. మధ్యాహ్నం 12గంటలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయి... అమరావతి కోసం రైతుల నుండి తీసుకున్న భూముల గురించి, రైతులకు అందిస్తున్న సహాయం, ఏపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద కూడా చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా రాజధాని గ్రామాల్లో రైతుల నుండి భూములను బలవంతంగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తు.. చంద్రబాబుతో కలిసి లాండ్ పూలింగ్ మీద నిరసన స్వరాన్ని వినిపించారు.
ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత భేటీ అవుతున్నారు. అంతకు ముందు అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం అందినా కానీ సినిమా షూటింగ్ వల్ల రాలేకపోయారు. చంద్రబాబు స్వయంగా అమరావతి శంకుస్థాపనకు రావాలని ఫోన్ చేసి ఆహ్వానించారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో భేటీకి పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ లభించింది. దీంతో నేటి ఉదయం పవన్ కల్యాణ్ విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడ శివారులోని గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 10.30 గంటలకు పవన్ చేరుకుంటారు. పవన్ కల్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత 11 గంటలకు పవన్ కల్యాణ్ రాజధాని రైతులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తదనంతరం ఆయన 12 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more